షర్మిల హౌస్ అరెస్ట్…హై టెన్షన్

Date:

Share post:


అమరావతి రీస్టార్ట్ పనులను ప్రధాని మోదీ మే 2న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని పనులపై ‘అమరావతి క్యాపిటల్ కమిటీ’ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2015లో అమరావతి రాజధానికి మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంకల్పించారు. అయితే, షర్మిల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

తనను పట్టుకున్న మహిళా పోలీసులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి తీయ్..నా మీద చేయి వేసే అధికారం మీకు లేదంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ కార్యాలయానికి వెళుతున్నానని, అది కూడా నేరమా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకుండానే కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని షర్మిల అన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...