PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

షుగర్ రావడానికి కారణాలు

[ad_1]

పరిశోధనలు జరుగుతున్నప్పుడు వయస్సు ప్రామాణికంగా లక్షమందికి 117 మందికి వచ్చే డయాబెటిస్ 183 మందికి వస్తున్నట్లు తేలింది. ఇక ఇదే వైకల్యం అవకాశాలు 106 నుంచి 149కి పెరిగినట్లు చెబుతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రోజురోజుకి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ఈ సమస్యతో ఇతర అనారోగ్య సమ్యలు కూడా పెరుగుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇంతకు ముందు కేవలం 40 ఏళ్ళు దాటాక వచ్చే ఈ మధుమేహం ఇప్పుడు 30 సంవత్సరాలు, అంతకంటే ముందుగానే వస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది బీఎమ్‌జె అనే వెబ్‌సైట్.. యువతలో డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగిందని చెబుతోంది.

ప్రాంతంతో సంబంధం లేకుండా..

ప్రాంతంతో సంబంధం లేకుండా..

అయితే, డయాబెటిస్ అనేది ఆ ప్రాంతం ఈ ప్రాంత అని తేడా లేకుండా అన్ని చోట్ల ఇలానే టైప్ 2 డయాబెటిస్ పెరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే, దీనికి చుట్టూ ఉన్న వాతావరణం, మన జీవన విధానం ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయని చెబుతున్నాయి. సరైన జీవన విధానం లేని కారణంగా ముందు నుంచి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతామని తెలుసు. ఇక తాజాగా పరిశోధనలు కూడా ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టాయి.

కాలుష్యం..

కాలుష్యం..

పొల్యూషన్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉండి ఎక్కువగా పొగత్రాగేవారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది. దీంతో ఎంత పొల్యూషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ఎంత వీలైతే అంతగా పొగత్రాగడం మానేయాలని సూచిస్తున్నారు.
Also Read : Soft Roti : ఇలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి..

లైఫ్‌స్టైల్‌తో రిస్కే..

లైఫ్‌స్టైల్‌తో రిస్కే..

సరైన జీవన విధానం గురించి ఎంతగా చెప్పినా.. నేటి స్పీడ్ యుగంలో ఇది కష్టమైపోతోంది. పని ఒత్తిడి కారణంగా రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రపోయి, ఉదయానే ఆలస్యంగా నిద్రలేచి టెన్షన్‌తో ఉద్యోగాలకి చేరి ఆ సమయంలో దొరికినది ఏదో ఒకటి తినడం. ఇదే ప్రతి ఒక్కరి జీవనంలో కామన్ అయిపోయింది. ఇలాంటి కారణాల వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, వీలైనంతగా అలా కాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంత పని ఉన్నా సరే దానిని ముందుగానే ముగించుకుని నిద్రపోవాలని, పెండింగ్ వర్క్స్ ఏమున్నా ఉదయాన్నే లేచి చేయడం వల్ల చాలా వరకూ రిలాక్స్‌డ్‌గా ఉండడమే కాకుండా పని కూడా మరింత సమర్థవంతంగా చేయగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఉదయమే లేస్తే అప్పుడు మీ పనులు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. దీంతో చాలా వరకూ ఒత్తిడికి దూరమవ్వొచ్చు.

జన్యుశాస్త్రం కారణంగా..

జన్యుశాస్త్రం కారణంగా..

అదే విధంగా, షుగర్ రావడానికి మరో కారణాల్లో ఒకటి. పేరెంట్స్‌కి సమస్య ఉంటే పిల్లలకి కూడా రావడం. తల్లిదండ్రులకి షుగర్ ఉంటే ఆ పిల్లలకి షుగర్ వచ్చే అవకాశం 50 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సో, కుటుంబంలో తల్లిదండ్రులకి షుగర్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహాతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read : శృంగారంలో తృప్తి లేకపోవడానికి కారణాలు ఇవే..

పోషకాహారం..

పోషకాహారం..

ముందుగా చెప్పుకున్నట్లు చాలా మంది రెడీ టూ ఈట్ వంటి ఫుడ్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇవి అంతగా మంచివి కావు. ఇందులో ఉప్పు, షుగర్ శాతాన్ని పెంచుతాయి. అందుకే వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. వీటి బదులు హెల్దీ ఫుడ్స్ తీసుకోవచ్చు. మొలకలు, నట్స్ తినడం మంచిది వీటితో పాటు ఖర్జూరాలు కలిపి తినొచ్చు. మొలకలని అలానే కాకుండా సలాడ్స్‌లా, కర్రీల్లా చేసుకుని తినొచ్చు.
Also Read : Soaked Dry fruits : వీటిని నానబెట్టి ఉదయాన్నే తింటే బరువు తగ్గి గుండెకి మంచిదట..

వర్కౌట్స్ చేస్తూ..

వర్కౌట్స్ చేస్తూ..

శారీరక శ్రమ లేకపోవడం కారణంగా ఈజీగా బరువు పెరుగుతారు. ఈ పెరిగిన బరువే అనేక ఆరోగ్య సమస్యలకి మూలం అందుకే బరువు తగ్గించడంతో పాటు వర్కౌట్ చేస్తే ఫిట్‌గా కూడా ఉంటారు. అందుకే మీకు వీలైనంతగా రోజూ వర్కౌట్ చేసే ప్రయత్నం చేయండి. కనీసం 30 నిమిషాల పాటు మీ ఇంట్లోనే నడవండి. ఇలా చేయడం వల్ల చాలా వరకూ షుగర్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *