ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరికి సమంతా రూత్ ప్రభు దూసుకుపోతుంది. దక్షిణాదిలో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకటిగా నిలిచింది. ఇక నార్త్ లోను వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం నిర్మాతగా మారి శుభం సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఎంతో వేగవంతం చేసిన సమంత.. తాజాగా వెన్నెల కిషోర్ లైవ్ చాటింగ్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెపై వెన్నెల కిషోర్ కేకలు వేస్తూ కోపంతో ఊగిపోయాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో.. అంతగా అతనికి కోపం రావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
సమంత సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రలాలాను స్థాపించిన తర్వాత మొదట సినిమా శుభంను రూపొందించింది. ఈ సినిమాకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్, సంగీతం అందించారు. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా సమంత ప్రమోషన్స్లో బిజీ అయ్యారు. తను నిర్మాతగా మారడం గురించి సమంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడింది. నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలు ఏవి నాకు తెలియలేదు. ఒక్కరోజు ఒక్క సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత నష్టం వచ్చేస్తుంది.. డబ్బు ఎంత వృధా అయిపోతుందో.. నాకు బాగా తెలిసొచ్చింది. ఎంతోమంది టైం వేస్ట్ అవుతుందని అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ క్రమంలోనే విభిన్న రితీలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన సమంత.. కమెడియన్ వెన్నెల కిషోర్ తో లైవ్ చాటింగ్లో పాల్గొంది. వెన్నెల కిషోర్తో మాట్లాడుతూ.. మే 9న శుభం సినిమా ప్రీమియర్స్ ఉన్నాయి. నువ్వు కచ్చితంగా రావాలి.. నువ్వు వస్తున్నావు కదా.. నా ఫస్ట్ ప్రొడక్షన్ శుభం సినిమా చాలా బాగా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నువ్వు వచ్చి సినిమా రివ్యూ ఇవ్వాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అందరికీ బాగా అనిపిస్తుంది అంటూ గలగలా మాట్లాడేసింది. సింగిల్ మూవీ నాది రిలీజ్ అవుతుంది అంటూ వెన్నెల కిషోర్ చెప్పాలని చూసిన పట్టించుకోకుండా.. నీ ఫ్యామిలీ లేదా.. వారిని కూడా పిలువు.. వాళ్ళు కచ్చితంగా రావాలి.
నువ్వు కూడా వస్తున్నావు కదా.. నాకు అర్జెంట్ పని ఉంది నువ్వు శుభం ప్రివ్యూ కి కచ్చితంగా రావాలి అంటూ వెన్నెల కిషోర్ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా.. బై బై అంటూ టాటా చెప్పేసి కాల్ కట్ చేసేసింది. ఇక తను మాట్లాడుతున్నా సమంత వినకపోవడం పై వెన్నెల కిషోర్ ఫైర్ అయ్యారు. అదే రోజు మే 9న నేను నటించిన సింగిల్ రాబోతుంది. ఆ సినిమాలో నేను సెకండ్ లీడ్. నాది ఫుల్ లెన్త్ రోల్ అని చెప్తున్న వినరు ఏంటి.. ఈ శ్యామ్కు ప్రపంచంతో సంబంధం లేదు.. నీది నీకే.. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ శుభం. సింగిల్, శుభం ఒకేరోజు రిలీజ్ అవుతుంది అంటూ మొఖం చెట్లించుకొని చిర్బుర్లు ఆడాడు వెన్నెల కిషోర్. అయితే వీరిద్దరి మధ్యన ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ మాత్రం గట్టిగా వర్క్ అవుట్ అయ్యాయి.
సమంత దెబ్బకు చిత్తైన వెన్నెల కిషోర్@Samanthaprabhu2 @vennelakishore #Subham #Single pic.twitter.com/Dc3eE0PqNW
— Rajababu Anumula (@Rajababu_a) May 6, 2025