సింహాచలం ఘటన..సాఫ్ట్‌వేర్‌ దంపతులు మృతి – Navatelangana

Date:

Share post:


నవతెలంగాణ-హైదరాబాద్ : సింహాచలం ఘటనలో మృతిచెందిన వారిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)గా నిర్ధరించారు. వీరు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ.. ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు దర్శన నిమిత్తం రూ.300 క్యూలైన్‌లో వేచిఉండగా గోడకూలిన ఘటనలో ఉమామహేశ్వరరావు, శైలజ మృతిచెందారు. ఉమామహేశ్‌ హెచ్‌సీఎల్‌లో, శైలజ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులిద్దరూ చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్...

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...