హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు – Adya News Telugu

Date:

Share post:


– Advertisement –

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. మే రెండోవారం నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠం రూ.10, గరిష్ఠం రూ.60 ఉండగా.. గరిష్ఠం రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపింది L&T మెట్రో సంస్థ.

కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది L&T సంస్థ. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా పడింది. కానీ ఇప్పుడు చార్జీల పెంపు తధ్యమని L&T సంస్థ పేర్కొనగా ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ ఉంది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు చేయగా మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసింది సంస్థ.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...

 ఏపీకి 4.. తెలంగాణకు 10.26 టీఎంసీలు..కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

- Advertisement - నవతెలంగాణ-హైదరాబాద్ : తాగునీటి అవసరాల కోసం కృష్ణా బేసిన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ నాలుగు టీఎంసీలు, తెలంగాణ 10.26 టీఎంసీలు వాడుకోవచ్చని...