PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవాళ బంగారం, వెండి ధరలు – కొత్త రేట్లివి


Latest Gold-Silver Price 14 May 2023: ఈ వారంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది, గరిష్ట స్థాయి నుంచి దిగి వచ్చింది. ప్రస్తుతం ఔన్స్‌ (28.35 గ్రాములు) 2,015 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఇవాళ, ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. వెండి రేటులోనూ ఎలాంటి మార్పు లేదు, నిన్నటి ధరే కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 56,650 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 61,800 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 56,650 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 61,800 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 78,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 57,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,350 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 56,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,800 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,950 గా నమోదైంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,800 గా ఉంది. 
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,850 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 56,650 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 61,800 గా ఉంది.

ప్లాటినం ధర (Today’s Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం ‘ప్లాటినం’ ధర కూడా మారలేదు, 10 గ్రాముల రేటు ₹ 27,690 వద్ద ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది. ఫలితంగా ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *