PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గ్లోబల్‌ రీజన్స్‌, యూఎస్ ఫెడ్‌ హాకిష్‌ కామెంట్స్‌ – సెన్సెక్స్‌ 671, నిఫ్టీ 176 డౌన్‌

[ad_1]

Stock Market Closing 10 March 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం టెర్రర్‌ చూపించాయి. భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూస్‌ ఫెడ్‌ హాకిష్‌ కామెంట్స్‌, ద్రవ్యోల్బణం నియంత్రణలో వైఫల్యం, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు, బ్యాంకింగ్‌ రంగంపై ఒత్తిడి నష్టాలకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 1767 పాయింట్లు తగ్గి 17,412 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 671 పాయింట్లు పతనమై 59,135 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.02 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 59,806 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,259 వద్ద మొదలైంది. 58,884 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,262 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 671 పాయింట్ల నష్టంతో 59,135 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 17,589 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,443 వద్ద ఓపెనైంది. 17,324 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,451 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 176 పాయింట్లు పతనమై 17,412 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 40,805 వద్ద మొదలైంది. 40,341 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 771 పాయింట్లు తగ్గి 40,585 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, బ్రిటానియా, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్‌, హెచ్డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ రంగాల సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.56,070 గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.65,250 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.24,740 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *