PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

బ్యాంకింగ్‌, రియాల్టీ షేర్ల కోసం ఎగబడ్డ మదుపర్లు – నష్టాల్ని తగ్గించుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ


Stock Market Closing 27 February 2023: 

స్టాక్‌ మార్కెట్లు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం భారీగా పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం భయాలూ ఇందుకు తోడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు రికవరీ బాట పట్టాయి. నష్టాలను తగ్గించుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 73 పాయింట్లు తగ్గి 17,392 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 175 పాయింట్ల తగ్గి 59,288 వద్ద ముగిశాయి. ప్రధానంగా బ్యాంకు, ఫైనాన్స్‌ షేర్లకు డిమాండ్‌ కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 82.84 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 9,463 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,331 వద్ద మొదలైంది. 58,937 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,441 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 175 పాయింట్ల నష్టంతో 59,288 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 17,465 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,428 వద్ద ఓపెనైంది. 17,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,451 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్లు తగ్గి 17,392 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 39,820 వద్ద మొదలైంది. 39,745 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,371 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 397 పాయింట్లు పెరిగి 40,307 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, పవర్‌ గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.56,020గా ఉంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.24,170 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.





Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *