400 డ్రోన్లతో పాక్ నిఘా..చిత్తు చేసిన భారత్

Date:

Share post:


భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎల్ వోసీ దగ్గర ఇరు దేశాల మధ్య కాల్పులు జరుగుతుండగా..ఇరు వైపులా ప్రాణ నష్టం కలుగుతోంది. ఈ క్రమంలోనే భారత్ పై పాక్ భారీ కుట్ర పన్నిందని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. 400 డ్రోన్లతో భారత్ లోని 36 ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు పాక్ పెద్ద కుట్ర పన్నిదని ఆయన వెల్లడించారు. జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 36 ప్రాంతాలను ఎంపిక చేసుకుందని తెలిపారు.

టర్కీకి చెందిన ‘ఆసిస్‌గార్డ్ సోంగర్’ రకం డ్రోన్లను పాకిస్థాన్ ఉపయోగించినట్లు ప్రాథమిక అంచనా వేశారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని సేకరించడం కోసం వాటిని ఉపయోగించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగిందని, నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలకు పాల్పడుతూ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోందని ఆరోపించారు.

ఇక, భారత్ పై దాడి చేసిన తర్వాత పౌర విమానాలను రక్షణ కవచాలుగా పాక్ వాడుకుందని భారత రక్షణ శాఖ ప్రతినిధులు తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించినప్పటికీ, కరాచీ, లాహోర్ మధ్య పౌర విమాన సర్వీసులను నిలిపివేయలేదని వారు తెలిపారు. తమ డ్రోన్ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన వస్తుందని తెలిసి కూడా, పౌర విమానాలను అడ్డుపెట్టుకోవడం ద్వారా పాకిస్థాన్ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని ఫైర్ అయ్యారు. ప్రార్థనా మందిరాలను కూడా లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందని, కానీ, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...