PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Aurora: సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత లడఖ్‌లో అరుదైన అరోరా

[ad_1]

తరుచూ అర్కిటిక్ ప్రాంతంలో కనిపించే అరుదైన అరోరా.. గత నెల లడఖ్‌లో కనువిందు చేసింది. భూ అయస్కాంత తుఫాను భూమిని తాకింది. హాన్లేలోని ఒక ఎత్తైన పరిశోధనా కేంద్రం ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (IAO)లో ఏర్పాటు చేసిన 360-డిగ్రీల కెమెరా.. ఆర్కిటిక్ ప్రాంతంలోని సాధారణంగా కనిపింే ఈ అద్భుతమైన దృశ్యాన్ని బంధించింది. ఏప్రిల్ 22-23 రాత్రి సమయంలో ఈ అరోరా కనిపించింది. సౌర తుఫాను కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME)కారణంగా ఈ వెలుగు ఏర్పడుతుంది. సూర్యుని ఉపరితలంపై ప్లాస్మా భారీ పేలుడు వల్ల సంభవించే కరోనల్ మాస్ ఎజెక్షన్.. గంటకు అనేక మిలియన్ల కిలోమీటర్ల వేగంతో భూమిని తాకి, దాని అయస్కాంత క్షేత్రానికి ఆటంకాలు కలిగిస్తుంది.4,500 మీటర్ల ఎత్తులో సరస్వతి పర్వతంపై ఏర్పాటుచేసిన కెమెరాలు బంధించిన ఫోటోలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ విడుదల చేసింది. టైమ్‌లాప్స్ వీడియో లడఖ్‌లోని చాంగ్‌తంగ్‌లో రాత్రిపూట ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతోంది. ‘అరోరా రాత్రిపూట సాధారణం కంటే తక్కువ అక్షాంశాలకు చేరుకుంది.. ఇది యూరప్, చైనా, భారత్‌లోని లడఖ్ నుంచి అరుదైన వీక్షణకు దారితీసింది’ అని ఐఐఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వగీష్ మిశ్రా అన్నారు.
‘ఇంత తీవ్రమైన భూ అయస్కాంత తుఫాను చివరిసారిగా 2015లో సంభవించింది.’ అని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా సీఎంఈ సమయంలో రంగుల విస్ఫోటనం సంభవించింది. ఐరోపాలోని ఫ్రాన్స్, జర్మనీ, ఉత్తర అమెరికాలో ద్వీపాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కొలరాడో, న్యూ మెక్సికోలో తక్కువ అక్షాంశాలకు ఆరోరా చేరుకుంది. అరోరాలు అరోరల్ జోన్‌ల వెలుపల సాపేక్షంగా అరుదైన సంఘటన అయినప్పటికీ రెండు అర్ధగోళాలలో 65, 75 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నాయి. సౌర కార్యకలాపాలు పెరగడం వంటి అంతరిక్ష వాతావరణ క్రమరాహిత్యాల సమయంలో భూమధ్యరేఖకు దగ్గరగా కనిపిస్తాయి.

గత నెలలో సంభవించిన భూ అయస్కాంత తుఫాను తీవ్రత 4వ స్థాయిగా వర్గీకరించారు. అంతరిక్ష వాతావరణ పరిణామాలో లడఖ్‌లో ఈ దృశ్యం సాధ్యమైంది. లడఖ్‌లోని హన్లే అబ్జర్వేటరీ ఏప్రిల్‌లో గుర్తించిన స్టాండర్డ్ ఆరోరా రెడ్ (SAR)ను ఐఐఏపీ విశ్లేషిస్తోంది. ‘ఏప్రిల్ 24 తెల్లవారుజామున ఆర్క్ ఉత్తర హోరిజోన్‌లో కనిపించింది.. చాలా సేపు ఉంది. కానీ, దురదృష్టవశాత్తు ఆ సమయంలో అబ్జర్వేటరీ నుంచి ఎవరూ బయటకు లేరు.. కాబట్టి దానిని నేరుగా చూడలేకపోయారు.. ఇది అబ్జర్వేటరీలో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే 360-డిగ్రీల స్కై కెమెరాలో మాత్రమే రికార్డ్ చేయబడింది’ అని ఐఐఏపీ వర్గాలు తెలిపాయి.

‘అరోరాలు సాధారణంగా ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలకు పరిమితం.. ఎందుకంటే సూర్యుడి నుంచి చార్జ్ చేయబడిన కణాలు భూ అయస్కాంత గోళాన్ని దాటి వాతావరణంలో ఆక్సిజన్, నైట్రోజన్‌తో సంకర్షణ చెంది కాంతి ప్రదర్శనను సృష్టించాయి.. అయినప్పటికీ, చాలా బలమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ సంఘటనల సమయంలో సూర్యుని నుంచి పదార్థం అయస్కాంత గోళంలోకి చొచ్చుకుపోయి లడఖ్ వంటి ప్రదేశాలలో అరోరా ఏర్పడటానికి దారితీయవచ్చు’ అని ఆర్యభట్ట రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ దీపాంకర్ భట్టాచార్య అన్నారు.

Read More Latest Science & Technology And Telugu News

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *