News
oi-Mamidi Ayyappa
Bumper
IPO:
చాలా
కాలంగా
మార్కెట్లలో
మంచి
ఐపీవో
కోసం
ఎదురుచూసిన
ఇన్వెస్టర్లకు
మంచి
కాలం
వచ్చిందనిపిస్తోంది.
ప్రఖ్యాత
దేశీయ
ఫార్మా
సంస్థ
మ్యాన్
కైండ్
ఐపీవో
నేడు
స్టాక్
మార్కెట్లలోకి
అడుగు
పెట్టింది.
మ్యాన్
కైండ్
ఫార్మా
ఐపీవోలో
షేర్లు
పొందిన
ఇన్వెస్టర్లు
మంచి
రాబడులను
పొందారు.
ఈ
స్టాక్
బీఎస్ఈలో
రూ.1300
వద్ద
లిస్ట్
అయ్యింది.
అంటే
షేర్లు
మార్కెట్లో
దాదాపు
20
శాతం
ప్రీమియం
ధరకు
ట్రేడింగ్
ప్రారంభించాయి.
మధ్యాహ్నం
11.25
గంటల
సమయంలో
స్టాక్
ధర
రూ.1,375
వద్ద
ఉంది.
అలాగే
ఇంట్రాడేలో
గరిష్ఠ
ధర
రూ.1,414ను
తాకింది.

ఐపీవో
ప్రైస్
బ్యాంక్
గమనిస్తే
ఒక్కో
షేరు
ధర
రూ.1026
నుంచి
రూ.1080గా
ఉంది.
నిన్న
సాయంత్రం
గ్రే
మార్కెట్లో
స్టాక్
ప్రీమియం
రూ.120గా
ఉంది.
ప్రస్తుత
మార్కెట్
విలువ
ప్రకారం
ఒక్కో
షేరుపై
ఐపీవోలో
స్టాక్స్
పొందిన
ఇన్వెస్టర్లు
రూ.295
లాభం
పొందారు.
దీనికి
ముందు
2020లో
గ్లాండ్
ఫార్మా
కంపెనీ
రూ.6,480
కోట్ల
ఐపీవో
ఫ్లోట్
చేయగా..
ఆ
తర్వాత
ఫార్మా
రంగంలో
వస్తున్న
అతిపెద్ద
ఐపీవోగా
మ్యామ్
కైండ్
నిలిచింది.

ప్రధానంగా
అర్హత
కలిగిన
సంస్థాగత
పెట్టుబడిదారుల
నుండి
బలమైన
ప్రతిస్పందన
లభించటంతో
ఐపీవో
విజయవంతం
అయ్యింది.
దాదాపు
50
రెట్లు
అధికంగా
బిడ్డింగ్
జరిగింది.
తాజా
ఐపీవో
ద్వారా
కంపెనీ
రూ.4326
కోట్లను
సమీకరించింది.
ఈ
ఐపీవోలో
CPPIB,
అబుదాబి
ఇన్వెస్ట్మెంట్
అథారిటీ,
గోల్డ్మన్
సాచ్స్,
ఫిడిలిటీ,
బ్లాక్రాక్,
GIS,
నోమురా
వంటి
16
మ్యూచువల్
ఫండ్స్
స్కీమ్స్
ఫార్మా
ఐపీవోలో
ఆసక్తిని
కనబరిచాయి.
English summary
Mankind Pharma IPO made bumber listing in markets pour profits to investors on 1st day
Mankind Pharma IPO made bumber listing in markets pour profits to investors on 1st day
Story first published: Tuesday, May 9, 2023, 12:14 [IST]