CEO’s On Economy: 2023 కష్టమేనంటున్న కంపెనీల సీఈవోలు.. భారత వ్యాపారవేత్తలు ఏమంటున్నారంటే..
మదిలో మాట..
రానున్న 12 నెలల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణించవచ్చని సర్వేలో వెల్లడైంది. ఇటువంటి సర్వేలను నిర్వహించటం PwC 12 ఏళ్ల కిందట ప్రారంభించింది. అయితే ఈ సారి మాత్రం CEOలు ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తమ అత్యంత నిరాశావాద అంచనాలను వ్యక్తం చేశారని PwC వెల్లడించింది. ప్రస్తుతం అనుకరిస్తున్న మార్గంలో సాగితే ఆర్థికంగా లాభదాయకంగా ఉండటం కుదరదని తాము నమ్ముతున్నట్లు చెప్పారు.
దేశాల వృద్ధి..
అమెరికా, బ్రెజిల్, భారత్, చైనాలతో పోల్చినప్పడు.. ఫ్రాన్స్, జర్మనీ, యూకేలోని కంపెనీల నాయకులు ప్రపంచ దేశాల కంటే వారి దేశాల వృద్ధి గురించి తక్కువ ఆశాజనకంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రపంచ ఆర్థికాలకు ముప్పుగా ఉన్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ వైరుధ్యాలతో పాటు మరిన్ని ప్రమాదాలు గత ఏడాది నుంచి తగ్గాయి.
భారత సీఈవోలు..
భారత కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న సీఈవోలు ప్రస్తుతం కంపెనీల్లో ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. చాలా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను లేదా వారికి చెల్లిస్తున్న వేతనాలను తగ్గించాలని భావించటం లేదని సర్వేలో ఇండియన్ సీఈవోలు చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత సీఈవోలు ఆశాజనకంగా ఉన్నారు.
ప్రతికూలంలో అనుకూలం..
రానున్న 12 నెలల్లో భారతదేశ ఆర్థిక వృద్ధిపై ఇక్కడి కంపెనీల సీఈవోలు ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చేసిన ఒక సర్వే ప్రకారం.. మూడింట రెండొంతుల మంది ప్రైవేట్, ప్రభుత్వ రంగ ముఖ్య ఆర్థికవేత్తలు 2023లో ప్రపంచ మాంద్యం వచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చేజారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు తేరుకోలేని దెబ్బ తగులుతుందని వారు భావిస్తున్నారు.