షాకింగ్ రిపోర్ట్..

ఇటీవల అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు నేరుగా విదేశీ అనుబంధ సంస్థను ఉపయోగించలేదని నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీలను కొనుగోలు చేయటానికి ఆఫ్‌షోర్ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించినట్లు బయటపడింది. అంబుజా సిమెంట్స్ జారీ చేసిన చివరి ఆఫర్ లెటర్ ప్రకారం.. మారిషస్, దుబాయ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని సంస్థల ద్వారా ఎండీవర్ అంతిమ ప్రయోజనకరమైన యజమానులు వినోద్ శాంతిలాల్ అదానీ, ఆయన భార్య అని బయటపడింది.

టీఎంసీ ఎంపీ టార్గెట్

..

మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ద్వారా అదానీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని TMC MP మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ అదానీ గ్రూప్ సొంత కంపెనీలు కాదని ఆమె తన ట్వీట్ లో వెల్లడించారు. అంబుజా సిమెంట్స్ తన పుస్తకాలపై డిసెంబర్ 2022 చివరి నాటికి రూ.9,829 కోట్ల నగదు మరియు నగదుకు సమానమైన వాటిని కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

కంపెనీల కొనుగోలు..

కంపెనీల కొనుగోలు..

హోల్సిమ్‌తో డీల్ వివరాలను పంచుకుంటూ అదానీ గ్రూప్ తన ప్రకటనలో 14 అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 4.50 బిలియన్ డాలర్ల సహకారం ద్వారా లావాదేవీకి నిధులు సమకూర్చుకున్నట్లు పేర్కొంది. బార్‌క్లేస్ బ్యాంక్ PLC, డ్యుయిష్ బ్యాంక్ AG, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లు ఈ లావాదేవీకి అసలైన ప్రధాన నిర్వాహకులు, బుక్-రన్నర్‌లుగా వ్యవహరించాయి. ఈ తరుణంలో హిండెన్ బర్గ్ నివేదికపై జనవరి 29న స్పందించింది. వినోద్ అదానీ ఏ అదానీ లిస్టెడ్ ఎంటిటీలు లేదా వాటి అనుబంధ సంస్థలలో ఎటువంటి నిర్వాహక పదవిని కలిగి ఉండరని, రోజువారీ వ్యవహారాల్లోనూ ఎలాంటి పాత్ర కలిగి ఉండరని బదులిచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *