[ad_1]
News
oi-Mamidi Ayyappa
Gold
News:
కరోనా
తర్వాత
ఆర్థిక
వ్యవస్థల్లో
రిస్క్
అవర్షన్
ఏర్పడింది.
దీనివల్ల
ఆర్థిక
వ్యవస్థలు
తీవ్రంగా
ప్రభావితం
అవుతాయి.
ఇలాంటి
అనిశ్చితులను
ఎదుర్కోవటంలో
బంగారం
కీలక
పాత్ర
పోషిస్తుంది.
ఇలాంటి
ఆర్థిక
పరిస్థితులను
ఎదుర్కొనేందుకు
రిజర్వు
బ్యాంక్
ఆఫ్
ఇండియా
తన
వద్ద
బంగారం
నిల్వలను
పెంచుకుంది.
RBI
డేటాను
పరిశీలిస్తే
మార్చి
2020లో
ఫారెక్స్
నిల్వల్లో
కేవలం
బంగారం
వాటా
6
శాతంగా
ఉంది.
అయితే
మార్చి
24,
2024న
రిజర్వు
బ్యాంక్
బంగారం
నిల్వలు
7.85
శాతానికి
పెరిగాయి.
అంటే
విలువ
ప్రకారం
రూ.2.09
లక్షల
కోట్లు
విలువైన
బంగారం
2020లో
ఉండగా..
ప్రస్తుతం
దాదాపు
రూ.3.75
లక్షల
కోట్ల
ఖరీదైన
గోల్డ్
ఉంది.
ప్రపంచ
వ్యాప్తంగా
ద్రవ్యోల్బణం,
వడ్డీ
రేట్ల
పెంపు
కొనసాగుతున్న
తరుణంలో
చాలా
దేశాల
సెంట్రల్
బ్యాంకులు
బంగారం
నిల్వలను
పెంచుకునేందుకు
చర్యలు
చేపడుతున్నాయి.
2022లో
ప్రపంచ
వ్యాప్తంగా
సెంట్రల్
బ్యాంకులు
తమ
నిల్వలకు
దాదాపు
70
బిలియన్
డాలర్ల
విలువైన
1,136
టన్నుల
బంగారాన్ని
జోడించాయని
వరల్డ్
గోల్డ్
కౌన్సిల్
డేటా
వెల్లడించింది.
అనిశ్చితితో
కూడిన
ఆర్థిక
పరిస్థితుల్లో
బంగారం
అత్యంత
సురక్షితమైనది,
క్రాస్
బోర్డర్
కరెన్సీ
మాదిరిగా
పనిచేస్తుంది
కాబట్టి
సెంట్రల్
బ్యాంకులు
పసిడి
నిల్వలను
పెంచుకున్నాయి.
విదేశీ
పెట్టుబడిదారులు
తమ
డబ్బును
వెనక్కి
తీసుకోవటం,
యూఎస్
ఫెడ్
దూకుడుగా
రేట్ల
పెంపు
వంటి
కారణాలతో
రూపాయి
విలువ
2022లో
భారీగా
పడిపోయింది.
డాలర్
తో
మారకపు
విలువ
83
మార్కును
దాటడం
ఆందోళనను
కలిగించింది.
అలాగే
బంగారం
నిల్వలు
భారీగా
పెరగటానికి..
కరోనా
మహమ్మారి,
ఉక్రెయిన్
రష్యా
యుద్ధం,
అధిక
ద్రవ్యోల్బణం,
వడ్డీ
రేట్ల
పెంపు
వంటి
అనేక
కారణాలు
కారణాలుగా
నిలిచాయి.
ఈ
తరుణంలో
బంగారం
నిల్వలు
పెరిగే
ట్రెండ్
కొనసాగే
అవకాశం
ఉందని
డీలర్లు
అంచనా
వేస్తున్నారు.
చాలా
సెంట్రల్
బ్యాంకులు
కేవలం
విదేశీ
మారక
నిల్వల్లో
కరెన్సీలనే
కాకుండా
బంగారాన్ని
కలిగి
ఉండేందుకు
మెుగ్గుచూపటమే
కొనుగోళ్లకు
అసలు
కారణంగా
నిలుస్తోంది.
English summary
RBI drastically increased gold reserves after covid pandemic, Know latest data
RBI drastically increased gold reserves after covid pandemic, Know latest data
Story first published: Wednesday, April 26, 2023, 14:47 [IST]
[ad_2]
Source link