News
oi-Chekkilla Srinivas
దేశంలో చాలా మంది క్యాన్సర్ తో మృతి చెందుతున్నారు. అయితే క్యాన్యర్ కు చికిత్స చేయించుకోలేక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. దీన్ని దృష్టి పెట్టుకుని 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య మంత్రి క్యాన్సర్ పేషెంట్ ఫండ్ (HMCPF) పథకాన్ని ప్రారంభించారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కాన్సర్ పేషెంట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దేశంలో ఉన్న 27 క్యాన్సర్ సెంటర్లలో చికిత్స తీసుకునే వారికి మాత్రమే చికిత్స ఖర్చుని బట్టి సహాయం అందిస్తారు.
2019లో ఈ పథకంలో భాగంగా ఇచ్చే ఆర్ధిక సాయాన్ని గరిష్టంగా ఒక్కో పేటెంట్కు రూ.15 లక్షలుగా పెంచారు. 1996లో తీసుకువచ్చిన రాష్ట్రీయ ఆరోగ్య నిధి (RAN) పథకం కింద HMCPF అమలు చేస్తున్నారు..దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కాన్సర్ బాధితులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేయబడుతుంది. దేశంలో ఉన్న 27 రీజియనల్ క్యాన్సర్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.

English summary
Center is providing financial assistance of Rs.15 lakh under HMCPF to those suffering from cancer
Many people are dying of cancer in the country. But many people die because they cannot get treatment for cancer.
Story first published: Saturday, February 18, 2023, 18:05 [IST]