[ad_1]
బయోఏషియాలో భాగంగా..
ప్రపంచంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ తన గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్, ఐటి సామర్థ్యాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కంపెనీ రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. బయోఏషియా 2023లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సమిత్ హిరావత్తో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
|
కొత్తగా ఉపాధి కల్పన..
కంపెనీ పెట్టుబడుల నిర్ణయం కారణంగా రానున్న కాలంలో 1,500 మంది ఉపాధి అవకాశాలు పొందుతారని తెలుస్తోంది. BMS పెట్టుబడులను ప్రకటించటంపై మంత్రి కేసీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటైన BMS.. హైదరాబాద్ మహానగరాన్ని ఎంచుకోవటం గర్వించదగ్గ విషయంగా తాను గట్టిగా నమ్ముతున్నానని కేటీఆర్ తెలిపా
|
వెల్స్పన్ పెట్టుబడులు..
వెల్స్పన్ గ్రూప్ తెలంగాణలో రూ.3,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. టెక్స్టైల్ పార్కు ప్రారంభోత్సవంతో వెల్స్పన్ గ్రూప్ ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వెల్స్పన్ గ్రూప్ అత్యాధునిక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు వెచ్చించిన రూ.2,000 కోట్లకు ఈ పెట్టుబడి అదనంగా ఉంది. చందనవెల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతంలో నెలకొల్పిన పరిశ్రమల్లో యువత, మహిళలకు ఉపాధి కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు.
[ad_2]
Source link