IPL 2025 : ఐపీఎల్ టోర్నమెంట్ పునఃప్రారంభంపై చైర్మన్ అరుణ్ ధుమాల్..

Date:

Share post:


భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీకారం కుద‌ర‌డంతో ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల దృష్టి ఐపీఎల్ పై ప‌డింది

IPL 2025 : ఐపీఎల్ టోర్నమెంట్ పునఃప్రారంభంపై చైర్మన్ అరుణ్ ధుమాల్..

IPL Chairman Arun Dhumals statement on possible restart of tournament

Updated On : May 11, 2025 / 11:30 AM IST

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీకారం కుద‌ర‌డంతో ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల దృష్టి ఐపీఎల్ పై ప‌డింది. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక‌త్త కార‌ణంగా ఐపీఎల్ 2025 సీజ‌న్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టోర్న‌మెంట్‌ ను పునఃప్రారంభించ‌డం పై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించాడు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఐపీఎల్ ప్రారంభించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపాడు. అయితే.. ఇందుకు షెడ్యూల్‌ను రూపొందించాల్సి ఉంద‌న్నాడు.

‘కాల్పుల విరమణ ఇప్పుడే ప్రకటించబడింది. ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించి, ముగించే అవకాశాన్ని మేము ఇప్పుడు అన్వేషిస్తున్నాము. దానిని వెంటనే నిర్వహించడం సాధ్యమైతే.. వేదికలు, తేదీలతో పాటు చాలా వాటిపై ప‌ని చేయాల్సి ఉంటుంది. జట్టు యజమానులు, ప్రసారకులు, వాటాదారులతో మాట్లాడి ఎలా ముందుకు సాగాలో ఒక మార్గాన్ని కనుగొంటాము. ముఖ్యంగా.. మేము ప్రభుత్వంతో సంప్రదించవలసి ఉంటుంది.’ అని ధుమల్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

Team India : టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌, వైస్ కెప్టెన్ ఫిక్స్‌..! బీసీసీఐ ప్లాన్ ఇదేనా..!

వీలైనంత త్వరగా టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించాలనే బీసీసీఐ ఆలోచిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీల‌కు తెలియ‌జేసిన‌ట్లుగా నివేదిక పేర్కొంది. అయితే.. ఐపీఎల్ వాయిదా వేయ‌డంతో ఇప్ప‌టికే విదేశీ ఆట‌గాళ్లు వారి వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు వారంతా తిరిగి వ‌స్తారా? లేదా ? అన్న విష‌యాల‌ను చూడాల‌ని ఆ నివేదిక కోరుతోంది.

ఐపీఎల్ 2025 లో రెండు క్వాలిఫయర్లు, ఎలిమినేటర్, ఫైనల్ తో క‌లిపి 17 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పాక్ వైమానిక దాడుల కార‌ణంగా ధ‌ర్మ‌శాల‌లో ర‌ద్దైన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌ను మ‌ళ్లీ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో మిగిలిన మ్యాచ్‌ల‌కు చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ల‌ను వేదిక‌లుగా బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

PSL 2025 : ఎవ‌రు ఏమైనా చెప్పండి.. జ‌న్మ‌లో పాక్‌లో అడుగుపెట్ట‌న‌న్న మిచెల్‌.. చిన్న‌పిల్లాడిలా ఏడ్చిన టామ్ కరన్.. పీఎస్ఎల్‌లో విదేశీ క్రికెట‌ర్ల అనుభ‌వాలు..

విదేశీ ఆటగాళ్ల లభ్యత?
ఐపీఎల్‌లో మిగిలిన సీజ‌న్‌ను నిర్వ‌హించ‌డానికి బీసీసీఐకి రెండు వారాలు స‌మ‌యం కావాల్సి ఉంటుంది. అయితే.. జూన్ 11 నుంచి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ సైకిల్‌లో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు పాల్గొనే అవ‌కాశం ఉండ‌డంతో వారు ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడ‌తారా ? లేదా ? అన్న విష‌యం పై సందిగ్ధ‌త ఉంది. మే 29 నుంచి వెస్టిండీస్ జ‌ట్టు ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం ..ముగ్గురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవనంలో విద్యుదాఘాతం జరగడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం...