
IPL 205: కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా.. తొలి ఓవర్ లో 7 పరుగులు చేసింది. అంతే.. వర్షం మొదలైంది. దాంతో ఆట నిలిచిపోయింది. తిరిగి మ్యాచ్ నిర్వహించేందుకు సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్, పంజాబ్ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.