
వాంఖడే మైదానంలో మంగళవారం ఓవైపు వర్షం, మరోవైపు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో ముంబై పై గుజరాత్ టైటాన్స్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన సమయంలో మ్యాచ్ ను ఆలస్యంగా ఎందుకు ప్రారంభిస్తున్నారంటూ అంపైర్లపై గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా, రాహుల్ తెవాటియాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో విల్ జాక్స్ (35 బంతుల్లో 53 పరుగులు), సూర్యకుమార్ (24 బంతుల్లో 35 పరుగులు), కార్బిన్ బోష్ (22 బంతుల్లో 27 పరుగులు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో సాయికిశోర్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ తలా ఓ వికెట్ పడగొట్టారు.
MI vs GT : గుజరాత్ పై ఓటమి.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్.. సంతోషంగా ఉంది..
అనంతరం గుజరాత్ లక్ష్య ఛేదన సందర్భంగా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం వల్ల రెండోసారి ఆట నిలిచే సమయానికి గుజరాత్ 18 ఓవర్లలో 132/6 స్కోరుతో నిలిచింది. ఈ సమయంలో డక్వర్త్ లూయిస్ ప్రకారం ముంబై 5 పరుగుల ముందుంజలో ఉంది. భారీ వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోతే ముంబై గెలిచేది.
Rahul Tewatia saying where is rain.
– Ashish Nehra is furious. pic.twitter.com/Xfk2ddfLQH
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2025
కాగా.. వర్షం ఆగిపోయిన తరువాత మ్యాచ్ను పునఃప్రారంభించే సమయాన్ని ఉదయం 12.09 నుంచి 12.25కు ఆ తరువాత 12.30 కు మార్చారు. దీంతో మ్యాచ్ను ఎందుకు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు అంటు గుజరాత్ ఆటగాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం ఎక్కడ అంటూ రాహుల్ తెవాటియా అంపైర్లను అడుగగా.. ఆ పక్కనే ఉన్న ఆశిష్ నెహ్రా సైతం కోపంగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SRH : అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి సన్రైజర్స్ ఔట్.. కేకేఆర్, ఆర్సీబీ, లక్నోలకు కొత్త టెన్షన్..!
కాగా.. రెండో సారి వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను ఒక ఓవర్కు కుదించి గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్ణయించారు. దీంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 15 పరుగులు అవసరం అయ్యాయి. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన తెవాటియా రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి కొయెట్జీ సిక్స్ బాదాడు. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. అయితే ఇది నోబాల్. తరువాత బంతికి తెవాటియా సింగిల్ తీయగా.. రెండు బంతుల్లో గుజరాత్ విజయానికి ఒక్క పరుగే అవసరం. అయితే ఐదో బంతికి కొయెట్జీ ఔట్ కావడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే.. ఆఖరి బంతికి అర్షద్ ఖాన్ సింగిల్ తీసి గుజరాత్ కు విజయాన్ని అందించాడు.
గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ (43), జోస్ బట్లర్ (30) లు రాణించారు. ఆఖరిలో తెవాటియా 8 బంతుల్లో ఓ ఫోర్ కొట్టి 11 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీకుమార్ లు తలా రెండు వికెట్లు తీశారు. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.