ఈశాన్య రాష్ట్రాలు
ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులకు మనహాయింపు ఉంది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నాన్-రెసిడెంట్, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, భారతదేశ పౌరుడు కాని వారికి మినహాయింపు ఉంది. ప్రస్తుతం పాన్ తో ఆధార్ లింక్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
పాన్ను ఆధార్తో ఎలా చేయాలంటే..
1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ అధికారిక వెబ్సైట్లను సందర్శించండి- eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.in
2. ఇప్పటికే రిజిస్టర్ చేయకుంటే మీ పాన్తో యూజర్ IDగా పోర్టల్లో నమోదు చేసుకోండి.
3. పోర్టల్లోకి లాగిన్ చేయండి.
4. పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో కనిపిస్తుంది. మెనూ బార్లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్లు’కి వెళ్లి లింక్ ఆధార్పై క్లిక్ చేయండి.
5. పాన్ కార్డ్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు కనిపిస్తాయి.
6. ఆధార్తో వివరాలను ధృవీకరించాలి. వివరాలు సరిపోలితే, ఆధార్ నంబర్ను నమోదు చేసి, లింక్ నౌ బటన్పై క్లిక్ చేయండి.
పాన్ను ఆధార్తో లింక్ చేసే ఇతర పద్ధతులు
1. లింక్ చేసే ప్రక్రియ కోసం వ్యక్తులు క్రింది వెబ్సైట్లను కూడా సందర్శించవచ్చు- https://www.utiitsl.com/, https://www.egov-nsdl.co.in/
2. SMS ద్వారా: కింది సందేశం UIDPANని టైప్ చేయండి. సందేశాన్ని 567678 లేదా 56161కు పంపవచ్చు.
3. సమీపంలోని PAN సేవా కేంద్రాలను సందర్శించడం: సమీపంలోని PAN సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లింక్ చేసే ప్రక్రియను మాన్యువల్గా కూడా చేయవచ్చు.