News
oi-Chekkilla Srinivas
ఎయిర్క్రాఫ్ట్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుల ఆర్డర్ బుక్ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 20 ఏళ్లలో భారత్కు 31,000 మంది పైలట్లు, 26,000 మంది మెకానిక్లు అవసరమయ్యే అవకాశం ఉందని యూఎస్ ఎయిర్క్రాఫ్ట్ మేకర్ బోయింగ్ CII ఈవెంట్లో తెలిపింది. రాబోయే కొన్నేళ్లలో దక్షిణాసియా ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా కొనసాగుతుందని భావిస్తున్నట్లు బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే తెలిపారు.
ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ కు ఇవ్వడంతో భారత ఏరోస్పేస్ పరిశ్రమను మార్చేస్తాయని ఆయన అన్నారు. భారత్ ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే, మౌలిక సదుపాయాలను పటిష్టంగా మార్చడంపై చాలా దృష్టి పెట్టాలని, ఎయిర్పోర్ట్లను కలిగి ఉన్న హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు పైలట్లను కలిగి ఉన్న కీలకమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉందని ఆయన వివరించారు. గత నెలలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బోయింగ్, యూరోపియన్ ఏవియేషన్ మేజర్ ఎయిర్బస్తో కలిపి మొత్తం 470 విమానాల కోసం ఆర్డర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.

బోయింగ్ 2040 నాటికి ఎయిర్ ట్రాఫిక్ వృద్ధిని 7 శాతంగా అంచనా వేసింది. కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత, విమాన ప్రయాణ డిమాండ్లో కోలుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున విమానయానానికి కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
English summary
India need 31000 pilots for next 20 years
US aircraft maker Boeing said at a CII event that India is likely to need 31,000 pilots and 26,000 mechanics over the next 20 years amid a growing order book of aircraft original equipment manufacturers.
Story first published: Wednesday, March 22, 2023, 11:59 [IST]