Prakash Raj: ప్రస్తుతం యావత్ దేశం సహా ప్రపంచ దేశాలు చంద్రయాన్ 3 ల్యాండింగ్ గురించి సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా కాలుమోపాలని కోట్లాది మంది భారతీయులతోపాటు వివిధ దేశాల్లోనూ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 ప్రయోగంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చంద్రయాన్ 3 పై ప్రకాశ్ రాజ్.. తన ట్విటర్ ఖాతాలో చేసిన పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశం కోసం అహర్నిషలు కష్టపడిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రకాశ్ రాజ్ తీవ్రంగా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి ప్రకాశ్ రాజ్.. ఆదివారం తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక ఫోటోను ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్.. బ్రేకింగ్ న్యూస్.. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ తీసి పంపిన మొట్టమొదటి ఫోటో అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఛాయ్‌ కలుపుతూ కొంచెం వ్యంగ్యంగా ఉన్న రీతిలో ఆ ఫోటోలో ఓ వ్యక్తి ఉన్నారు. అయితే అది ఎవరూ అని ప్రకాశ్ రాజ్ ఎక్కడా వెల్లడించలేదు. అయితే అది ప్రధాని మోదీని ఉద్దేశించే ప్రకాశ్ రాజ్ ఈ పోస్ట్ పెట్టాడని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

దేశానికి ప్రతిష్ఠ తీసుకువచ్చేలా ఇస్రో శాస్త్రవేత్తలు కష్టపడి రూపొందించిన చంద్రయాన్ 3 ప్రయోగంపై ఇలాంటి కామెంట్లు, పోస్టులు చేయడం ఏంటని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ శాస్త్రవేత్తలను అవమానించడమేనని మండిపడుతున్నారు. రాజకీయాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలను అవమానిస్తారా అంటూ కొందరు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం ప్రపంచంలో భారతదేశానికే గర్వకారణమని.. రాజకీయ నాయకులను గుడ్డిగా వ్యతిరేకించే క్రమంలో ప్రఖ్యాత ఇస్రో సైంటిస్ట్‌లనే అవమానిస్తున్నారని మరికొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక చంద్రయాన్‌ 3 ప్రయోగం బీజేపీకి సంబంధించింది కాదని.. ఇస్రోకు సంబంధించిందని.. అది విజయవంతమైతే భారత్‌ విజయమని కామెంట్లు చేస్తున్నారు. చంద్రయాన్ 3 ఏ ఒక్క పార్టీదో, ప్రభుత్వానికో సంబంధించింది కాదని.. రాజకీయాల్లోకి ఇస్రోను లాగొద్దని సూచించారు. దేశం కోసం గత కొన్నేళ్లుగా కష్టపడుతున్న శాస్త్రవేత్తల మీద విమర్శలు చేయడం సరికాదని మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులపై చేసే వ్యక్తిగత విమర్శలతో ఇస్రో సైంటిస్టులను అవమానం జరగడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు.

అయితే ఈ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ద్వేషం ఎప్పుడూ ద్వేషాన్ని మాత్రమే చూస్తుందని.. తాను నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కాలం నాటి జోక్‌ను చెప్పానని పేర్కొన్నారు. తాను కేరళ చాయ్‌వాలా గురించి ప్రస్తావించానని.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు ఏ ఛాయ్‌వాల్ గురించి అనుకుంటున్నారని ప్రశ్నించారు. జోక్‌లు అర్థం కాకపోతే మీరే జోకర్లు అవుతారని వ్యంగ్యంగా స్పందించారు.

Chandrayaan 3 Lander: మిత్రమా స్వాగతం.. చంద్రయాన్ 3 కి స్వాగతం పలికిన చంద్రయాన్ 2 ఆర్బిటర్
Chandrayaan 3 Landing: సేఫ్ ల్యాండింగ్‌పై ఇస్రో ధీమా.. చంద్రయాన్ 3 కి లూనా 25 మధ్య తేడా ఏంటి?

Read More Latest Science & Technology News And Telugu News



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *