PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Sebi New Rules: బ్రాండ్‌ విలువలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్ దూకుడు


నూతన సాంకేతికతే టీసీఎస్ బలం

ఈ ఏడాది అనేక మంది క్లైంట్‌లు హైబ్రిడ్‌ పని విధానానికి మారడంతో.. వారి అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల సేవలను టీసీఎస్‌ అందించింది. వ్యాపారాల నిర్వహణ కోసం బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లలో కొత్త సాంకేతికను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిందని నివేదిక పేర్కొంది.

పర్యావరణ ఫ్రెండ్లీ ఇన్ఫోసిస్‌

పర్యావరణ ఫ్రెండ్లీ ఇన్ఫోసిస్‌

కరోనా కారణంగా అనేక అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేయడం, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు ప్రయత్నించడంతో ఐటీ సెక్టార్‌లో మంచి వృద్ధి కనిపించిందని బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది. బలమైన ఈఎస్‌జీ సిస్టం, స్థిరమైన వ్యాపార విధానం, పర్యావరణ సహిత పాలసీలు వల్ల ఇందులో ఇన్ఫోసిస్ ముందంజలో ఉందని వెల్లడించింది.

స్థానాలు పదిలం

స్థానాలు పదిలం

యాక్సెంచర్ బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి 39.9 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక తెలిపింది. తద్వారా ఐదో ఏడాది సైతం ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలుపుకున్నట్లు వెల్లడించింది. హెచ్‌సీఎల్‌ టెక్ బ్రాండ్ విలువ 7 శాతం పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. నోయిడాకు చెందిన మరో సంస్థ సైతం ప్రపంచ టాప్ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు చెప్పింది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *