మార్కెట్ సూచీలు..
ఉదయం 9.21 గంటల సమయంలో మార్కెట్ సూచీ సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ సూచీ 99 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 342 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లలో నమ్మకాలు పెరిగిన కారణంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ల ర్యాలీకి ఇది ప్రధాన కారణంగా నిలుస్తోంది.
టాప్ గెయినర్స్..
మార్కెట్లలో ప్రధానంగా టాటా మోటార్స్, హిందాల్కొ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, టైటాన్ తో పాటు మరిన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
టాప్ లూజర్స్..
ఈ క్రమంలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా షేర్లు మాత్రం ఎన్ఎస్ఈ సూచీలో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.