News
lekhaka-Bhusarapu Pavani
Stock
Market:
ఈరోజు
ఫ్లాట్
గా
ప్రారంభమైన
దేశీయ
స్టాక్
మార్కెట్లు..
కొద్ది
సేపు
ఆ
స్తబ్ధతను
కొనసాగించాయి.
అయితే
చాలా
కంపెనీలు
తమ
క్యూ4
ఫలితాలను
విడుదల
చేయగా
అవి
ఇన్వెస్టర్లను
కొనుగోళ్ల
వైపు
నడిపాయి.
మార్కెట్లలో
ప్రభుత్వరంగ
బ్యాంకులు,
మెటల్
రంగాల్లోని
షేర్లు
లాభపడ్డాయి.
ఎఫ్ఎమ్సీజీ
రంగంలోని
హిందుస్థాన్
యూనీలివర్
కంపెనీ
క్యూ-4
ఫలితాలను
విడుదల
చేసింది.
గత
ఏడాది
కంటే
ఆదాయం
11
శాతం
పెరగగా..
నికర
లాభం
10
శాతం
పెరిగి
రూ.2,552
కోట్లుగా
నమోదైంది.
ఇదే
సమయంలో
బజాజ్
ఫిన్
సర్వ్
నికర
లాభం
క్యూ-4లో
31
శాతం
పెరిగి
రూ.1,769
కోట్లుగా
నమోదైంది.
మార్కెట్లు
ముగిసే
సమయానికి
బెంచ్
మార్క్
సూచీ
సెన్సెక్స్
349
పాయింట్ల
లాభపడగా..
నిఫ్టీ
సూచీ
101
పాయింట్ల
లాభంలో
ముగిసింది.
ఇదే
సమయంలో
నిఫ్టీ
బ్యాంక్
సూచీ
171
పాయింట్లు
లాభపడగా..
నిఫ్టీ
మిడ్
క్యాప్
సూచీ
175
పాయింట్ల
మేర
పెరిగింది.
NSE
సూచీలోని
బజాజ్
ఆటో,
బజాజ్
ఫిన్
సర్వ్,
ఎస్బీఐ
లైఫ్,
బజాజ్
ఫైనాన్స్,
యూపీఎల్,
బీపీసీఎల్,
ఎయిర్
టెల్,
ఇన్ఫోసిస్,
కోటక్
బ్యాంక్,
హిందాల్కొ,
ఎల్
టి,
డాక్టర్
రెడ్డీస్,
జేఎస్డబ్ల్యూ
స్టీల్,
టాటా
కన్జూమర్,
కోల్
ఇండియా,
ఐటీసీ,
మహీంద్రా
అండ్
మహీంద్రా,
సన్
ఫార్మా,
రిలయన్స్,
నెస్లే
కంపెనీల
షేర్లు
లాభాలతో
టాప్
గెయినర్స్
గా
ముగిశాయి.
ఇదే
క్రమంలో
సూచీలోని
హెచ్డీఎఫ్సీ
లైఫ్,
హిందుస్థాన్
యూనీలివర్,
ఓఎన్జీసీ,
యాక్సిస్
బ్యాంక్,
పవర్
గ్రిడ్,
అదానీ
పోర్ట్స్,
ఎస్బీఐ,
ఐటీసీ,
ఏషియన్
పెయింట్స్
కంపెనీ
షేర్లు
నష్టాల్లో
ముగిసి
టాప్
లూజర్స్
గా
ముగిశాయి.
English summary
stock Markets closed green as nifty sensex gains amid q4 results boosts buying from investors
stock Markets closed green as nifty sensex gains amid q4 results boosts buying from investors
Story first published: Thursday, April 27, 2023, 16:00 [IST]