News
lekhaka-Bhusarapu Pavani
Tax:
కేంద్రంలోని
BJP
ప్రభుత్వం
ఈ
ఏడాది
ప్రవేశపెట్టిన
బడ్జెట్
లో
పలు
మార్పులు
చేసింది.
వ్యక్తిగత
ఆదాయపు
పన్ను
పరిమితి
దగ్గర
నుంచి
లాంగ్
టర్మ్
క్యాపిటల్
గెయిన్
వరకు
వివిధ
కొత్త
పద్ధతులు
అమల్లోకి
వచ్చాయి.
ప్రైవేటు
ఉద్యోగుల
లీవ్ఎన్క్యాష్మెంట్
విషయంలోనూ
పన్ను
మినహాయింపుపై
మంచి
నిర్ణయం
తీసుకుంది.
బడ్జెట్
ప్రకటనకు
అనుగుణంగా..
ప్రైవేట్
రంగ
ఉద్యోగులకు
కేంద్ర
ఆర్థిక
మంత్రిత్వ
శాఖ
శుభవార్త
చెప్పింది.
పదవీ
విరమణ
తర్వాత
లీవ్
ఎన్క్యాష్మెంట్
కోసం
పన్ను
మినహాయింపు
పరిమితిని
25
లక్షలకు
పెంచింది.
ఇప్పటివరకు
ప్రభుత్వేతర
ఉద్యోగులకు
ఈ
మినహాయింపు
కేవలం
3
లక్షలు
మాత్రమే
ఉంది.
అయితే
దీనిని
2002లో
నిర్ణయించగా,
అప్పటికి
ప్రభుత్వ
ఉద్యోగుల
అత్యధిక
మూలవేతనం
నెలకు
30
వేలు
కావడం
గమనార్హం.

సెక్షన్
10(10AA)(ii)
కింద
ఆదాయపు
పన్ను
నుంచి
మినహాయించబడిన
మొత్తం
25
లక్షల
పరిమితిని
మించరాదని
సెంట్రల్
బోర్డ్
ఆఫ్
డైరెక్ట్
టాక్సెస్
(CBDT)
ఒక
ప్రకటనలో
తెలిపింది.
ఒకటి
కంటే
ఎక్కువ
కంపెనీల
నుంచి
ఇటువంటి
చెల్లింపులు
స్వీకరిస్తున్న
ప్రభుత్వేతర
ఉద్యోగులకు
ఈ
నిబంధన
వర్తిస్తుందని
స్పష్టం
చేసింది.
ఏప్రిల్
1,
2023
నుంచి
ఈ
రూల్
అమలులోకి
రానున్నట్లు
ప్రకటించింది.

“2023
బడ్జెట్
ప్రసంగంలోని
ప్రతిపాదనకు
అనుగుణంగా..
కేంద్ర
ప్రభుత్వం
01.04.2023
నుంచి
25
లక్షల
వరకు
పదవీ
విరమణ
లేదా
ప్రభుత్వేతర
జీతం
పొందే
ఉద్యోగుల
సెలవు
ఎన్క్యాష్మెంట్పై
పన్ను
మినహాయింపు
పరిమితిని
పెంచింది”
అని
CBDT
తెలిపింది.
ఈ
మేరకు
మార్పులు
చేయనున్నట్లు
2023-24
బడ్జెట్
ప్రవేశపెట్టే
సమయంలో
కేంద్ర
ఆర్థిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
పార్లమెంటులో
ప్రకటించారు.
దానిని
ఇప్పుడు
CBDT
అమల్లోకి
తీసుకొచ్చింది.
English summary
CBDT increased IT exemption on leave encashment to 25 lakhs for private employees
CBDT increased IT exemption on leave encashment to 25 lakhs for private employees
Story first published: Friday, May 26, 2023, 7:21 [IST]