News
oi-Mamidi Ayyappa
variable
pay:
ఐటీ
రంగంలో
పనిచేస్తున్న
చాలా
మంది
ఉద్యోగులకు
ప్రస్తుతం
దెబ్బమీద
దెబ్బ
తగులుతూనే
ఉంది.
ఎందుకంటే
కఠినమైన
వ్యాపార
పరిస్థితుల
కారణంగా
దిగ్గజ
టెక్
కంపెనీలు
ఉద్యోగుల
వేరియబుల్
వేతనాల్లో
భారీగా
కోతలు
విధిస్తున్నాయి.
నాలుగో
త్రైమాసికంలో
దేశీయ
ఐటీ
సేవల
సంస్థ
విప్రో
తన
ఉద్యోగులకు
80.25%
వేరియబుల్
పేను
విడుదల
చేసింది.
ఇదే
సమయంలో
మరో
దిగ్గజ
ఐటీ
కంపెనీ
ఇన్ఫోసిస్
మాత్రం
కేవలం
60
శాతం
వేరియబుల్
వేతనాన్ని
చెల్లించనున్నట్లు
వెల్లడైంది.
విప్రో
క్యూ-3లో
87
శాతం,
క్యూ-2లో
100
శాతం
వేరియబుల్
వేతనాన్ని
ఉద్యోగులకు
చెల్లించింది.మే
పేరోల్లో
ఉద్యోగులు
తమ
పనితీరు
వేతనాన్ని
అందుకోనున్నారు.
టీసీఎస్
మాత్రం
100
శాతం
వేరియబుల్
వేతనాన్ని
ఉద్యోగులకు
అందించింది.
కంపెనీలకు
డీల్స్
వేగంగా
ముందుకు
సాగకపోవటం..
ఖర్చులను
మదించుకుంటూ
జాగ్రత్తగా
ముందుకెళ్తున్న
వాతావరణంలో
కంపెనీలు
పోరాడుతున్నాయి.
ఇది
క్యూ-4
వేరియబుల్
వేతనాలపై
పడింది.
ముఖ్యంగా
భారతీయ
టెక్
కంపెనీలు
ఇప్పటి
వరకు
పెద్దగా
ఉద్యోగులను
తొలగించలేదు.
డీల్స్
రాంప్
డౌన్
కారణంగా
కంపెనీలు
అంచనా
వేసిన
Q4
గణాంకాల
కంటే
తక్కువగా
నివేదించబడ్డాయి.
మెుత్తానికి
గత
ఆర్థిక
సంవత్సరం
దేశంలోని
ఐటీ
కంపెనీలు
బలమైన
పనితీరు
కనబరిచినప్పటికీ..
చివరి
త్రైమాసికంలో
మాత్రం
అస్థిర
మార్కెట్లు,
ఊహించని
సంఘటనలు
కంపెనీలను
ప్రభావితం
చేసినట్లు
ఇన్ఫోసిస్
ఉద్యోగి
ఒకరు
వెల్లడించారు.
మార్కెట్లో
వస్తున్న
మార్పుల
పట్ల
వారు
అప్రమత్తంగా
ఉన్నట్లు
తెలిపారు.
రానున్న
త్రైమాసికాల్లో
ఆదాయాలు
తగ్గుతాయని
ఇన్ఫోసిస్
ఇప్పటికే
అంచనా
వేసింది.
అందుకే
చాలా
టెక్
కంపెనీలు
తాత్కాలికంగా
నియామకాలను
నిలిపివేశాయి.
వీటికి
తోడు
పెద్ద
ప్రాజెక్టుల
రద్దు,
బ్యాంకింగ్
సంక్షోభం,
టెక్
రంగంలో
భారీగా
తొలగింపులు
ఆందోళనలను
కలిగిస్తున్నాయి.
English summary
After Infosys, TCS IT Jaint Wipro also announced cut in Variable pay amid uncertinities
After Infosys, TCS IT Jaint Wipro also announced cut in Variable pay amid uncertinities
Story first published: Friday, May 19, 2023, 13:03 [IST]