[ad_1]
అగర్వాల్ వ్యాఖ్యలు..
తమ కంపెనీకి 1 బిలియన్ డాలర్ల అప్పు చెల్లింపులు వేరుశెనగలతో సమానమని ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. రానున్న ఏడాదికి గ్రూప్ వ్యాపారాల ద్వారా 9 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జిస్తామని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అదానీ గ్రూప్ పై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత మార్కెట్లో అధిక రుణాలను కలిగి ఉన్న కంపెనీలపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.
రేటింగ్ సంస్థ S&P గ్లోబల్..
అమెరికాకు చెందిన ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్.. ఇటీవల వేదాంత రిసోర్సెస్ తన ఆర్థిక బాధ్యతలను సెప్టెంబరు తర్వాత తీర్చగల సామర్థ్యం ప్రణాళికాబద్ధమైన 2 బిలియన్ డాలర్ల నిధుల సేకరణ, ఆఫ్రికాలో వేదాంత జింక్ ఆస్తుల ప్రతిపాదిత విక్రయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అయితే ఈ కామెంట్స్ ఇన్వెస్టర్లతో పాటు మార్కెట్లను కొంత కలవరానికి గురిచేసింది. ఆ తర్వాత స్టాక్ సైతం గత నెలలో 10 శాతం వరకు క్రాష్ అయ్యింది.
రుణాల కోసం చర్చలు..
8-10 శాతం వడ్డీ రేటుతో 1 బిలియన్ డాలర్ల రుణం కోసం వేదాంత జెపి మోర్గాన్, ఇతర బ్యాంకులతో చర్చలు జరుపుతోందని మైనింగ్ దిగ్గజం చెప్పారు. వేదాంత గ్రూప్ 13 బిలియన్ డాలర్ల కంటే తక్కువ రుణాలను కలిగి ఉంది. అయితే రానున్న కాలంలో అప్పులు లేని కంపెనీగా మారాలనుకోవటం సాధించగల లక్ష్యమని అనిల్ అగర్వాల్ తెలిపారు. లండన్ ప్రధాన కార్యాలయంగా కంపెనీ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది.
[ad_2]
Source link