News
lekhaka-Bhusarapu Pavani
Wipro
Results:
ఇన్వెస్టర్లు
చాలా
కాలంగా
ఎదురుచూస్తున్న
టెక్
దిగ్గజం
విప్రో
నాలుగో
త్రైమాసిక
ఫలితాలు
విడుదలయ్యాయి.
మార్కెట్లు
ముగిసిన
తర్వాత
విడుదలై
ఫలితాలు
అన్ని
టెక్
కంపెనీల్లాగానే
మార్కెట్
అంచనాలను
అందుకోవటంలో
విఫలమైంది.
విప్రో
మార్చి
2023తో
ముగిసిన
త్రైమాసికంలో
ఏకీకృత
నికర
లాభం
0.4
శాతం
క్షీణించి
రూ.3,075
కోట్లకు
చేరుకుంది.
గత
ఏడాది
ఇదే
సమయంలో
టెక్
కంపెనీ
లాభం
రూ.3,087
కోట్లుగా
నిలిచింది.
అయితే
క్యూ-3లో
రూ.3,053
కోట్ల
కంటే
విప్రో
లాభం
స్వల్పంగా
వృద్ధి
చెందింది.
వ్యాపార
కార్యకలాపాల
ద్వారా
నాలుగో
త్రైమాసికంలో
కంపెనీ
ఆదాయం
రూ.23,190
కోట్లుగా
ఉంది.
అయితే
గత
ఏడాది
ఇదే
సమయంలో
రూ.20,860
కోట్ల
కంటే
ఈసారి
ఆదాయం
11.2
శాతం
పెరిగింది.
కానీ
క్యూ-3
లో
నమోదు
చేసిన
రూ.23,229
కోట్ల
కంటే
కొంత
మేర
తగ్గుదల
నమోదైంది.
బ్రోకరేజ్
కంపెనీలు
నిర్వహించిన
పోల్
లో
కంపెనీ
ఆదాయం
13
శాతం
పెరిగి
రూ.23,505
కోట్లకు
చేరుకుంటుందని
అంచనా
వేయబడింది.
కానీ
వాస్తవ
సంఖ్యలు
ఈ
అంచనాలను
అందుకోలేక
పోయాయి.
అయితే
ఫలితాలకు
కొన్ని
రోజుల
ముందర
కంపెనీ
తన
ఈక్విటీ
షేర్ల
బైబ్యాక్
ప్రణాళికను
ప్రకటించింది.
దీని
ద్వారా
మెుత్తం
26.96
కోట్ల
ఈక్విటీ
షేర్లను
తిరిగి
కొనుగోలు
చేయనున్నట్లు
తెలుస్తోంది.
ఒక్కో
షేరుకు
రూ.445
చెల్లించి
రూ.12,000
కోట్ల
విలువైన
షేర్లను
కొనుగోలు
చేయాలని
కంపెనీ
ప్రతిపాదించింది.
English summary
IT major Wipro released its Q4 numbers and missed market estimates as income rose 11 percent
IT major Wipro released its Q4 numbers and missed market estimates as income rose 11 percent
Story first published: Thursday, April 27, 2023, 16:52 [IST]