ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

[ad_1]

Gold ATM : దేశంలోనే మొదటిసారి  గోల్డ్ ఏటీఎం ప్రారంభించడం, దానికి హైదరాబాద్ లో శ్రీకారం చుట్టడం పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బేగంపేట్ లోని అశోక రఘుపతి ఛాంబర్స్ లో శనివారం గోల్డ్ సిక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన గోల్డ్ ఏటీఎంను సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు.  మారుతున్న సాంకేతిక నిపుణతలతో ప్రజల అవసరాలు అభిరుచుల మేరకు వ్యాపార దృక్పథం  కూడా మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తక్కువ పరిమాణంలో బంగారాన్ని కోనుగోలు కోసం బంగారం షాప్ కు వెళ్లాలంటే మోహమాటపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా  గృహిణీలకు తాము  దాచుకున్న డబ్బులతో నిర్మొహమాటంగా ఏటీఎం వద్దకు వచ్చి బంగారాన్ని తీసుకోవచ్చని వివరించారు. ఈ ఏటీఎంలో 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకునే వెసులుబాటు ఉండడం సంతోషదాయకమని వెల్లడించారు. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *