మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పంచ గ్రహాలు

[ad_1]

మంగళవారం (మార్చి 28న) సాయంత్రం ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఐదు గ్రహాలు ఒకే కక్షలో కనువిందు చేయనున్నాయి. సూర్యాస్తమయం తర్వాత చంద్రుడికి చేరువగా ఈ గ్రహాలను వీక్షించొచ్చు. గురుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, వరుణ గ్రహాలు మనకు కనిపించనున్నాయి. ఈ గ్రహాలు రాత్రిపూట ఆకాశంలో కనిపించనున్నప్పటికీ.. ఇవి ఒకే సరళ రేఖపై కనిపించవు. భూమికి చేరువగా ఉండే గ్రహమైన శుక్రుడు, సౌర వ్యవస్థలో పెద్ద గ్రహమైన గురుడు మరోసారి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఒకదానికొకటి దూరంగా ఈ రెండు గ్రహాలు కనిపించనున్నాయి.

మన దేశంలోనూ ఈ గ్రహాలను వీక్షించొచ్చు. కానీ రాత్రి పూట కృతిమ వెలుతురు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సులభంగా చూడొచ్చు. ఆకాశంలో పశ్చిమంవైపు చూస్తే ఇవి కనిపించనున్నాయి. చంద్రుడితోపాటు శుక్ర గ్రహం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. అంగారక గ్రహం చంద్రుడికి చేరువగా ఉంటుంది. భూమి నుంచి దూరంగా ఉండటం, వాటి ప్రస్తుత కక్షను బట్టి అంగారకుడు, గురు గ్రహాలు కాస్త మసకగా కనిపిస్తాయి.

గురు, శుక్ర, అంగారక గ్రహాలు ప్రకాశవంతంగా ఉంటాయి కాబట్టి వాటిని సాధారణ కంటితోనే చూడొచ్చు. వరుణ గ్రహం భూమి నుంచి 3.05 వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఆ గ్రహాన్ని గుర్తించడానికి టెలిస్కోప్ అవసరం. సోమవారం కూడా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలు ఈ గ్రహాలను వీక్షించారు.

సూర్యాస్తమయం తర్వాత ఐదు గ్రహాలు ఒకదానికొకటి చేరువగా అరుదైన అమరికలో కనిపించనున్నాయి. రాత్రి 7.30 గంటల సమయంలో గురు గ్రహాన్ని చూడొచ్చు. దీని తర్వాత శుక్రుడు, వరణుడు, చంద్రుడు, అంగారక గ్రహాలు హారిజన్‌లో ఉంటాయి.

గ్రహాలు మనకు దగ్గరగా కనిపించినంత మాత్రాన అవి ఒక దగ్గరకు వచ్చినట్టు కాదు. గ్రహాల కక్షలు భూమి, సూర్యుడి కక్షలకు ఓవైపుగా వచ్చినందువల్ల అవి ఇలా కనిపిస్తాయి. మంగళవారమే కాకుండా.. ఈ నెలాఖరు వరకు ఈ గ్రహాలు ఆకాశంలో కనిపిస్తాయి. గత ఏడాది జూన్‌లోనూ ఈ ఐదు గ్రహాలు కనిపించాయి. మళ్లీ 2040లోనే ఇలాంటి అద్భుతం ఆకాశంలో కనిపించనుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *