[ad_1]
News
lekhaka-Bhusarapu Pavani
IT
News:
గడచిన
వారం
టెక్
కంపెనీలకు
అస్సలు
కలిసిరాలేదనే
చెప్పుకోవాలి.
దేశంలోని
అగ్ర
ఐటీ
సేవల
కంపెనీలు
స్టాక్స్
భారీగా
నష్టపోయాయి.
అయితే
దీనంతటికీ
కారణం
యాక్సెంచర్
చేసిన
ప్రకటనగా
తెలుస్తోంది.
దేశంలోని
టాప్-5
టెక్
కంపెనీలైన
టీసీఎస్,
ఇన్ఫోసిస్,
టెక్
మహీంద్రా,
విప్రో,
హెచ్సీఎల్
కంపెనీల
మార్కెట్
క్యాప్
ఏకంగా
రూ.19,000
కోట్లు
ఆవిరైంది.
ప్రస్తుత
గ్లోబల్
పరిస్థితుల
కారణంగా
FY23
వృద్ధి
అంచనాలను
యాక్సెంచర్
తగ్గించింది.
నాలుగో
త్రైమాసికంలో
అది
కేవలం
2-6
శాతానికి
పరిమితం
అవుతుందని
పేర్కొంది.
ఇటీవల
ఆదాయాలు,
మార్జిన్లతో
పాటు
డిమాండ్
తగ్గుదలపై
జాగ్రత్తగా
ఉండాలంటూ
కాగ్నిజెంట్,
EPAM,
Coforge,
HCL
చేసిన
కామెంట్లతో
సమీప
భవిష్యత్తుపై
యాక్సెంచర్
ఆందోళన
వ్యక్తం
చేసింది.
అలాగే
FY25లో
డిమాండ్
పుంజుకుంటుదని
ఆశించటం
ఆలోచించటం
రిస్క్
తో
కూడుకున్నదని
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.
గత
రెండేళ్ల
కాలం
తర్వాత
చిన్న
డీల్స్,
ద్రవ్యోల్బణం
వల్ల
వ్యయాలపై
జాగ్రత్తలు
వంటి
కారణాలతో
టెక్
కంపెనీ
యాక్సెంచర్
ఆందోళన
చెందుతోంది.
ఇండియన్
ఐటీ
కంపెనీలు
సైతం
ఇదే
మందగమనాన్ని
చూడవచ్చి
తెలుస్తోంది.
ప్రధాన
మార్కెట్
అయిన
అమెరికాలో
బలహీనతలు
ఐటీ
కంపెనీలపై
ప్రతికూల
ప్రభావాన్ని
చూపుతున్నాయి.
ఈ
క్రమంలో
బీఎస్ఈలో
టీసీఎస్
స్టాక్
0.92
శాతం
క్షీణించి
రూ.3,209
కనిష్ఠ
స్థాయికి
చేరుకుంది.
రెండో
స్థానంలో
ఉన్న
ఇన్ఫోసిస్
1.36
శాతం
క్షీణించి
రూ.1,265.15
వద్ద
కనిష్ఠ
స్థాయికి
పడిపోయింది.
హెచ్సీఎల్
టెక్నాలజీస్
1.04
శాతం
క్షీణించి
రూ.1,151.15కి
చేరుకుంది.
ఇక
విప్రో
స్టాక్
1
శాతం
క్షీణించి
రూ.378.10కి
చేరుకోగా..
టెక్
మహీంద్రా
షేర్లు
2.28
శాతం
మేర
క్షీణించి
రూ.1,094.10కి
చేరుకున్నాయి.
ఈ
ఐదు
కంపెనీల
మార్కెట్
క్యాప్
గురువారం
ముగింపు
నాటికి
రూ.19,168.70
కోట్లు
తగ్గి
రూ.23,32,827
కోట్లకు
చేరుకుంది.
ఇదే
క్రమంలో
ప్రఖ్యాత
నొమురా
ఇండియా
భారతీయ
IT
సేవల
కోసం
ప్రపంచ
దేశాల
నుంచి
డిమాండ్
ఔట్లుక్పై
ఆందోళన
వ్యక్తం
చేసింది.
FY24లో
కంపెనీల
అంతటా
ఆపరేటింగ్
పనితీరు
గణనీయంగా
మారుతుందంటూ
టెక్
మహీంద్రా,
కోఫోర్జ్
లపై
సానుకూలంగా
ఉన్నట్లు
వెల్లడించింది.
యాక్సెంచర్
ద్వారా
ఆదాయ
గైడెన్స్ను
తగ్గించటం..
IT
సేవలకు
డిమాండ్ను
తగ్గించడాన్ని
సూచిస్తుందని
నోమురా
అభిప్రాయపడింది.
ఇలాంటి
పరిస్థితుల్లో
ఇన్వెస్టర్లు
ఐటీ
కంపెనీల
షేర్లలో
పెట్టుబడులు
పెట్టేటప్పుడు
కొంత
జాగ్రత్త
వహించాల్సిన
అవసరం
ఉన్నట్లు
కనిపిస్తోంది.
English summary
Major IT companies from tcs to tech mahindra lost 19000 crores with accenture effect
Major IT companies from tcs to tech mahindra lost 19000 crores with accenture effect
Story first published: Saturday, June 24, 2023, 20:50 [IST]
[ad_2]
Source link
Leave a Reply