షార్‌లో ఆదిత్య ఎల్1 24 గంటల కౌంట్‌డౌన్ స్టార్ట్.. తిరుమలలో ప్రత్యేక పూజలు

[ad_1]

సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఆదిత్య- ఎల్1 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. పీఎస్‌ఎల్‌వీ-సీ57 వాహక నౌక ద్వారా శనివారం (సెప్టెంబరు 2న) ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ఇస్రో పంపుతోంది. ఇందుకు సంబంధించి 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 24 గంటల పాటు కొనసాగి.. శనివారం ఉదయం రెండో ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ప్రయోగానికి సంబంధించి గురువారం షార్‌లో ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్ నారాయణన్‌ ఆధ్వర్యంలో రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయోగానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. లాంచింగ్ వేహికల్ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, రిహార్సల్‌ తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సమీక్షించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని, ప్రయోగానికి ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌) సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ రాజరాజన్‌ ప్రయోగానికి పచ్చజెండా ఊపారు.

ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్‌ గురువారం రాత్రి షార్‌కు చేరుకున్నారు. ప్రయోగం పూర్తయ్యే వరకూ మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ రానున్నారు. మరోవైపు, ఇస్రో ఏ ప్రయోగం చేపట్టిన తిరుమలలో శ్రీవారికి ఆలయాన్ని దర్శించుకుని.. విజయవంతం కావాలని శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని.. ఆదిత్య ఎల్1 నమూనాను ఆయన పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకున్నారు.

కాగా, భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని సూర్యుడి హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని చేర్చనున్నారు. గ్రహణాల వంటి అడ్డంకులతో సంబంధం లేకుండా సూర్యుడ్ని నిరంతరం అధ్యయనం చేసేందుకు లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహం చేరి.. ఐదేళ్ల పాటు అక్కడ సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందులో మొత్తం ఏడు పేలోడ్‌లను అమర్చారు. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేయనున్నాయి. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌, మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌లను అధ్యయనం చేయనున్నాయి. లాంగ్రాజ్ పాయింట్ 1 ప్రదేశానికి ఉన్న సానుకూల పరిస్థితుల దృష్ట్యా ఈ నాలుగు పరికరాలు సూర్యుడ్ని స్వయంగా పరిశీలించనున్నాయి.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *