Health Care: వంట ఇలా చేస్తే విషంతో సమానం..! వీళ్లకు రిస్క్‌ ఇంకా ఎక్కువ..!

[ad_1]

ఈ అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది..

ఈ అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది..

బొగ్గు, కట్టెల పొయ్యిపై వండిన ఆహారాన్ని తినడం వల్ల ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, క్రానిక్ పల్మనరీ డిసీజ్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.​

Hold in a sneeze: తుమ్ము ఆపితే.. తిప్పలు తప్పవు..!

ఇంతమంది మరణిస్తున్నారు..

ఇంతమంది మరణిస్తున్నారు..

కట్టెల పొయ్యి, బొగ్గులపై తయారు చేసిన ఆహారం తీసుకుంటే.. శరీరంలో కాలుష్యాన్ని వ్యాపింపజేసేలా పనిచేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. దీని కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 3 మిలియన్ల మంది మరణిస్తున్నారని ఇందు 32% మంది గుండె సమస్యలతో, 23 % మంది స్ట్రోక్‌, 21% మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో, 19% మంది పల్మనరీ డిసీజ్‌తో, 6% మంది ఊపరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు.​

Saffron Tea: రాత్రి పూట ఈ టీ తాగితే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

వీరికి రిస్క్‌ ఎక్కువ..

వీరికి రిస్క్‌ ఎక్కువ..

ఈ విషపూరిత ఇంధనాల వినియోగం మహిళలు, పిల్లలకు అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. సహజంగానే, మహిళలు వీటి నుంచి వెలువడే ప్రమాదకరమైన పొగకు ఎక్కువగా గురవుతారు, అయితే పిల్లలు ఈ పొగను భరించలేరు.

ఇవి వాడండి..

ఇవి వాడండి..

ప్రపంచంలోని 10 మందిలో 3 మంది స్వచ్ఛమైన వంట ఇంధనాలను ఉపయోగించడం లేదని సంస్థ తెలిపింది. శుభ్రమైన వంట ఇంధనాల గురించి మాట్లాడినట్లయితే, వీటిలో బయోగ్యాస్, LPG, విద్యుత్, ఇథనాల్, సహజ వాయువు, సౌర శక్తి (BLEENS) ఉన్నాయి. వంటకు వీటినే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *