[ad_1]
Stocks
oi-Chekkilla Srinivas
బుధవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9 గంటల 33 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్లు పెరిగి 58,230 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు వృద్ధి చెంది 17,145 వద్ద ట్రేడవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సీఎల్ టెక్ , ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్, టీసీఎస్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎస్బీఐఎన్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ లాభాల్లో ట్రేడవుతన్నాయి.
యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఏసియన్ పేయింట్స్, ఐటీసీ, హెచ్ డీ ఎఫ్ సీ, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, పవరి గ్రిడ్ నష్టాల్లో కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ధర ప్రారంభ ట్రేడ్లో పడిపోయింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ వెహికల్ యూనిట్లోని షేర్లను విక్రయించడం ద్వారా $1-1.3 బిలియన్లను సేకరించడానికి ప్రపంచ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది.
English summary
Stock Market Started with profit on wednesday
The stock market started with gains on Wednesday. At 9:33 am, the BSE Sensex was up 155 points at 58,230. The NSE Nifty rose 38 points to trade at 17,145.
Story first published: Wednesday, March 22, 2023, 9:51 [IST]
[ad_2]
Source link
Leave a Reply