[ad_1]
Feature
oi-Garikapati Rajesh
zప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే చాలినంత సంపద ఉండాలనుకుంటాడు. దానికోసమే అందరూ పనిచేస్తుంటారు. కొంతమందికి ఆర్థిక వనరులున్నా జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటారు. ఎంత సంపాదించినప్పటికీ అది నిల్వ ఉండకపోవడమేకాక కొత్తగా అప్పులు కూడా చేస్తుంటారు. వాస్తు నిపుణులు చెప్పే కొన్ని సూచనలు, సలహాలు పాటిస్తే అందరికీ లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు.
ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూడాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే అలాగే చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీదేవి మంత్రం కూడా జపించాలని చెబుతున్నారు.
![when you wake up morning Do this when you wake up morning Do this](https://telugu.oneindia.com/img/2022/12/xeveryhumanwantstobehealthy1-1670483220.jpg.pagespeed.ic.5gvKt9rcME.jpg)
ఆహారం తీసుకునేటప్పుడు మనం కూర్చునే విధానం కూడా మనుషుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండాలని సూచిస్తున్నారు.
ప్రతి ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివపిస్తుంటుంది. ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. దీన్ని వల్ల అన్ని కోరికలు నెరవేరతాయని జ్యోతిష శాస్ర్తం వివరిస్తోంది.
![when you wake up morning Do this when you wake up morning Do this](https://telugu.oneindia.com/img/2022/12/xeveryhumanwantstobehealthy-1670483237.jpg.pagespeed.ic.NNEoy51zxM.jpg)
ఇంట్లో ఈశాన్య దిశకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎలాంటి వస్తువులు ఉండకూడదు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం దుష్ట శక్తులు ఇంటి నుంచి దూరంగా ఉండాలంటే ఈశాన్యంలో తరుచుగా గంగాజలాన్ని చల్లుకుంటుండాలి.
English summary
Every human wants to be healthy.
Story first published: Thursday, December 8, 2022, 12:38 [IST]
[ad_2]
Source link