అదే జరిగితే ఆగస్టు 27న ల్యాండింగ్.. చంద్రయాన్-3పై ప్లాన్ బీ వెల్లడించిన ఇస్రో

[ad_1]

చంద్రుడిపై అన్వేషణకు (Moon Study) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు (Soft Landing) ఇస్రో పకడ్బంధీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంపై అనువైన ప్రదేశం కోసం ల్యాండర్‌ అన్వేషణ మొదలుపెట్టింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమై.. 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలాన్ని విక్రమ్ ముద్దాడనుంది. అయితే, ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ప్లాన్ ‘బి’ని (Plan B) కూడా ఇస్రో సిద్ధం చేసింది.

ల్యాండర్‌ మాడ్యూల్‌కు సంబంధించి ఏవైనా ప్రతికూలత తలెత్తితే ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి మార్చనున్నట్లు ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (SAC) డైరెక్టర్‌ నిలేష్‌ ఎం.దేశాయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. మాడ్యూల్‌ స్థితి, చంద్రుడిపై వాతావరణానికి సంబంధించి ప్రతికూల పరిస్థితులను బట్టి ల్యాండింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆగస్టు 23న ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభానికి 2 గంటల ముందు పరిస్థితిని పరిశీలించిన అనంతరం సమీక్షిస్తామన్నారు.

‘‘ఆగస్టు 23న చంద్రుడిపై ఉపరితలంపై ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్‌ స్థితిగతులు, చంద్రుడిపై వాతావారణ పరిస్థితులను ఒకసారి అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ, అప్పుడు విక్రమ్‌ దిగేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆగస్టు 27కు ల్యాండింగ్‌ వాయిదా వేస్తాం.. కానీ, ఎలాంటి సమస్య లేకుండా ముందు అనుకున్నట్లు ఆగస్టు 23నే చంద్రుడిపై ల్యాండర్‌ను దింపుతాం’’ అని ఆయన అన్నారు.

2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలం కావడంతో ఇస్రో ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా చర్యలు చేపట్టింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా ల్యాండర్‌ను తీర్చిదిద్దారు. చంద్రయాన్‌-3ని ఫెయిల్యూర్ బేస్డ్ విధానంతో రూపొందించారు.

అల్గారిథమ్ వైఫల్యం, నియంత్రణ సమస్యల కారణంగా చంద్రయాన్-2 విఫలమైంది. దీనిపై బెంగళూరులోని ఐఐఎస్సీ ఏరోస్పేస్ సైంటిస్ట్ ప్రొఫెసర్ రాధాకాంత్ పాధి మాట్లాడుతూ.. ‘విక్రమ్ ల్యాండర్ కాళ్లు ఇప్పుడు మరింత బలంగా ఉన్నాయి’ అని తెలిపారు. ‘చంద్రయాన్-3 ‘సిక్స్ సిగ్మా’ ఆధారంగా రూపొందించారు.. ఇది మరింత పటిష్టమైన నిర్మాణం.. అన్ని పరిస్థితులను తట్టుకునేలా ల్యాండర్ రూపకల్పనపై దృష్టి పెట్టారు’ అని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘లూనా-25’ చివరి మెట్టుపై చతికిలపడింది. చంద్రుడి చివరి కక్ష్యలోకి ల్యాండర్‌ను మార్చే క్రమంలో సాంకేతిక లోపం కారణంగా అది కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరింత కసరత్తు చేపట్టారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *