భారత్.. నా గమ్యానికి చేరుకున్నాను.. చంద్రుడిపై విక్రమ్ దిగిన తర్వాత మెసేజ్

[ad_1]

నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టి విజయం సాధించింది. జులై 14న శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం4 ద్వారా విజయవంతంగా నింగిలోకి చేరిన చంద్రయాన్-3.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం వివిధ దశలను దాటుకుంటూ గమ్యానికి చేరుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా ఘనత సాధించిన భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగానూ చరిత్రను లిఖించింది.

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా చేరిన తర్వాత ఇస్రో సందేశం పంపింది. ‘భారత్.. నేను నా గమ్యాన్ని చేరుకున్నాను.. మీరు కూడా!’ అని చంద్రునిపై చంద్రయాన్-3 దిగిన తర్వాత ఇస్రో వ్యాఖ్యానించింది. తొలుత బుధవారం సాయంత్రం 5.44 గంటలకు బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్‌ మాడ్యూల్‌.. ల్యాండింగ్‌ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. అనంతరం విక్రమ్ ల్యాండింగ్‌ మాడ్యూల్‌కు ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ (ALS) కమాండ్‌ను ఇస్రో పంపింది.

ఈ కమాండ్‌ను అందుకున్న ల్యాండర్‌ మాడ్యూల్‌.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రారంభించింది. నాలుగు థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లను ప్రజ్వలించి వేగాన్ని తనకు తాను క్రమంగా తగ్గించుకుంది. రఫ్‌ బ్రేకింగ్‌ దశను విజయవంతంగా ముగించుకుని చంద్రుడి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.
ఆ తర్వాత ల్యాండర్‌ మాడ్యూల్‌ తన దిశను మార్చుకుంది.

ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా (ఎల్‌పీడీసీ), కేఏ బ్యాండ్‌ అండ్‌ లేజర్‌ బేస్డ్‌ ఆల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ వంటి సాధనాలతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపింది. దీంతో ఎవరూ ఇప్పటి వరకూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరింది.

కాగా, ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో బృందానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే, నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్ అభినందనలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ విజయవంతం చేసినందుకు నెల్సన్‌ శుభాకాంక్షలు చెప్పారు. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన 4వ దేశంగా నిలిచిన భారత్‌ను నెల్సన్‌ కొనియాడారు. మిషన్‌లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *