PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Hyderabad: వచ్చే దశాబ్దం భారత్‌దే.. ప్రపంచంలో శక్తివంతమైన వ్యవస్థ మనదగ్గరే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Hyderabad: ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతోంది. గత కొన్ని సంవత్సరాలు బలమైన నాయకత్వం ఉండటంతో మనదేశం చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తోంది. టెక్నాలజీ రంగంలో కీలక ఆవిష్కరణలు ఇందుకు మరింతగా దోహదపడుతున్నాయి.

ఏ దేశమైనా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించాలంటే రిస్క్ తీసుకోవడం తప్పనిసరి అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) అధ్యక్షుడు సంజీవ్ బజాజ్ అన్నారు. “సౌత్ ఇండియా@100: గోయింగ్ బియాండ్ బౌండరీస్” అనే అంశంపై జరిగిన CII వార్షిక ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.

రాబోయే దశాబ్దం భారతదేశానికి చెందినదని బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్ అన్నారు. దేశంలో శక్తివంతమైన ఇన్నోవేషన్ ఎకోసిష్టం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న 25 సంవత్సరాల్లో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి ఉంటుందని చెప్పారు.

Hyderabad: ప్రపంచంలో శక్తివంతమైన వ్యవస్థ మనదగ్గరే..

25 సంవత్సరాల్లో డిజిటల్ ప్రపంచం రోజువారీ జీవితంలో సాంకేతికతను ఎక్కువగా అనుసంధానించడం ద్వారా వర్గీకరించబడుతుందని CII డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. 2047 డిజిటల్ ప్రపంచంలో మరింత ముఖ్యమైన పాత్రను చూస్తుందని అభిప్రాయపడ్డారు.

భారతదేశం ఆవిష్కరణల కోసం తన పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో గొప్ప పురోగతిని సాధిస్తోందని సీఐఐ ఛైర్‌పర్సన్ సుచిత్రా ఎల్లా వ్యాఖ్యానించారు. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో దాని మెరుగుదలలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. “గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో భారతదేశం 40వ స్థానంలో ఉందని ఆమె వెల్లడించారు. నాలెడ్జ్ క్రియేషన్, ఇంపాక్ట్, డిఫ్యూజన్ వంటి రంగాల్లో కూడా భారత్ మంచి పనితీరు కనబరిచిందని వెల్లడించారు. ఈ ఆవిష్కరణకు మద్దతిచ్చే తగిన మౌలిక సదుపాయాలను నిర్మించాలని ఆమె తెలిపారు.

English summary

CII chair person suchitra ella says next decade is of India’s with Innovations

CII chair person suchitra ella says next decade is of India’s with Innovations

Story first published: Sunday, March 19, 2023, 12:21 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *