[ad_1]
News
oi-Mamidi Ayyappa
IT
News:
దేశీయ
ఐటీ
దిగ్గజం
టీసీఎస్
తన
నాలుగో
త్రైమాసిక
ఫలితాలను
విడుదల
చేసింది.
అయితే
మార్కెట్
అంచనాలను
ఐటీ
సంస్థ
అందుకోలేక
పోవటంతో
నేడు
మార్కెట్లో
షేర్లు
నష్టాలను
చవిచూశాయి.
తాజాగా
కంపెనీ
విడుదల
చేసిన
వివరాల
ప్రకారం
FY23
చివరి
త్రైమాసికంలో
14.7
శాతం
పెరిగి
రూ.11,392
కోట్లకు
చేరుకుంది.
గత
ఏడాది
ఇదే
కాలంలో
నివేదించబడిన
రూ.9,926
కోట్లతో
పోలిస్తే
లాభాలు
పెరిగాయి.
మూడో
త్రైమాసికంలో
లాభాలు
రూ.10,883
కోట్ల
కంటే
నాలుగో
త్రైమాసికంలో
4.7
శాతం
అధికంగా
నమోదైంది.
FY23లో
టీసీఎస్
22,600
మంది
ఉద్యోగులను
చేర్చుకుంది.
ఇది
అంతకు
ముందు
ఏడాదితో
నియామకాల
కంటే
చాలా
తక్కువగా
నమోదయ్యాయి.
మార్చి
31,
2023
నాటికి
కంపెనీ
హెడ్కౌంట్
6,14,795గా
ఉంది.
2015
ఆర్థిక
సంవత్సరం
తర్వాత
కొత్త
నియామకాలు
ఇంత
భారీ
సంఖ్యలో
తక్కువగా
నమోదు
కావటం
ఇదే
తొలిసారి.
2021లో
నికర
ప్రాతిపదికన
40,185
మంది
ఉద్యోగులను,
FY20లో
24,179,
FY19లో
29,287
మంది
ఉద్యోగులను
కంపెనీ
నియమించుకుంది.
దేశీయ
ఐటీ
రంగంతో
పాటు
అంతర్జాతీయంగా
కంపెనీలు
తీవ్ర
ఒత్తిడిని
ఎదుర్కొంటున్నాయి.
గతేడాది
ఇదే
త్రైమాసికంలో
టీసీఎస్
35,209
మంది
ఉద్యోగులను
చేర్చుకుంది.
TCS
Q1FY23లో
14,136
మంది
ఉద్యోగులను,
Q2లో
9,840
మంది
ఉద్యోగులను
రిక్రూట్
చేసుకుంది.
Q3లో
2,197
మంది
ఉద్యోగులు
తగ్గగా..
Q4లో
821
మంది
పెరిగారు.
నాలుగో
త్రైమాసికంలో
అట్రిషన్
రేటు
20.1
శాతంగా
నమోదైంది.
దీనికి
ముందు
క్వార్టర్లో
ఉద్యోగుల
రాజీనామాల
రేటు
21.3
శాతంగా
ఉంది.
English summary
Indian IT Jaint TCS recruitments in FY2023 Q4 fell by 78 percent, know attretion rate
Indian IT Jaint TCS recruitments in FY2023 Q4 fell by 78 percent, know attretion rate
Story first published: Thursday, April 13, 2023, 12:11 [IST]
[ad_2]
Source link