News
lekhaka-Bhusarapu Pavani
lottery
king:
లాటరీ
కింగ్
గా
పేరుగాంచిన
శాంటియాగో
మార్టిన్
కు
ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్
(ED)
షాకిచ్చింది.
తమిళనాడులో
ఆయనకు
చెందిన
దాదాపు
158
కోట్ల
విలువైన
చరాస్తులను
స్తంభింపజేసింది.
సెర్చ్
ఆపరేషన్లు
నిర్వహించి
స్తంభింపజేసింది.
కోయంబత్తూర్
మరియు
చెన్నైలలో
గత
గురు,
శుక్రవారాల్లో
జరిపిన
సెర్చ్
ఆపరేషన్
ఆధారంగా
ఈ
చర్య
తీసుకుంది.
మనీలాండరింగ్
నిరోధక
చట్టం
(PMLA),
2002లోని
నిబంధనల
ప్రకారం
మార్టిన్
ఆస్తులపై
ED
సోదాలు
జరిపింది.
ఇందులో
భాగంగా
చరాస్తులతో
పాటు
299.16
కోట్ల
విలువైన
స్థిరాస్తుల
పత్రాలను
కూడా
కేంద్ర
ఏజెన్సీ
స్వాధీనం
చేసుకుంది.
అంటే
మొత్తంగా
సుమారు
457
కోట్ల
విలువైన
ఆస్తులు
బయటకు
వచ్చినట్లు
తెలుస్తోంది.
నిబంధనల
ప్రకారం
వాటిని
స్వాధీనం
చేసుకోవడం
లేదా
స్తంభింపచేయడం
జరిగినట్లు
ED
వెల్లడించింది.

కోయంబత్తూరులోని
సిక్కిం
లాటరీల
మాస్టర్
డిస్ట్రిబ్యూటర్
అయిన
ఫ్యూచర్
గేమింగ్
సొల్యూషన్స్
ఇండియా
ప్రైవేట్
లిమిటెడ్
రిజిస్టర్డ్
ఆఫీస్,
శాంటియాగో
మార్టిన్
నివాస
ప్రాంగణాలు
మరియు
చెన్నైలోని
ఆయన
కుటుంబ
సభ్యుల
నివాస,
వ్యాపార
ప్రాంగణాల్లో
సోదాలు
జరిపినట్లు
ఎన్ఫోర్సమెంట్
డైరెక్టరేట్
తెలిపింది.
సిక్కిం
ప్రభుత్వ
లాటరీలను
అక్రమంగా
కేరళలో
విక్రయించడానికి
సంబంధించి
మార్టిన్
పై
ED
ఈ
చర్యలు
తీసుకుంది.
IPCలోని
వివిధ
సెక్షన్ల
కింద
నమోదైన
పలు
నేరాలకు
సంబంధించి
ఇప్పటికే
CBI
తుది
నివేదిక
ఇచ్చింది.
వాటి
ఆధారంగా
ఇప్పుడు
కేంద్ర
ఏజెన్సీ
మనీలాండరింగ్
దర్యాప్తును
ప్రారంభించింది.
ఏప్రిల్
1,
2009
నుంంచి
ఆగస్టు
31,
2010
మధ్య
మార్టిన్
సహా
ఆయన
అసోసియేట్
కంపనీలు
ప్రైజ్-విన్నింగ్
టికెట్ల
క్లెయిమ్స్
పెంచాయి.
తద్వారా
సిక్కిం
ప్రభుత్వానికి
నుంచి
910
కోట్ల
మేర
చట్ట
విరుద్ధంగా
లాభపడినట్లు
దర్యాప్తులో
తేలింది.
English summary
ED seized lottery king Santiago Martin properties
ED seized lottery king Santiago Martin properties..
Story first published: Monday, May 15, 2023, 21:14 [IST]