News
oi-Mamidi Ayyappa
Market
Closing:
ఉదయం
మార్కెట్ల
ప్రారంభ
సమయంలో
ఊగిసలాడిన
దేశీయ
స్టాక్
మార్కెట్లు
చివరికి
భారీ
లాభాల
నడుమ
ప్రయాణాన్ని
ముగించాయి.
ఈ
క్రమంలో
సెన్సెక్స్,
నిఫ్టీ
సూచీలు
1
శాతం
మేర
లాభపడ్డాయి.
మార్కెట్లు
ముగిసే
సమయానికి
బెంచ్
మార్క్
సూచీ
సెన్సెక్స్
629
పాయింట్లు
లాభ
పడగా..
మరో
కీలక
సూచీ
నిఫ్టీ
178
పాయింట్ల
మేర
లాభపడింది.
ఇదే
క్రమంలో
నిఫ్టీ
బ్యాంక్
సూచీ
337
పాయింట్లు,
నిఫ్టీ
మిడ్
క్యాప్
సూచీ
268
పాయింట్ల
మేర
లాభపడ్డాయి.

దేశీయ
ఈక్విటీ
మార్కెట్లు
మంచి
లాభాల్లో
ముగియటానికి
కారణాలను
గమనిస్తే
ముందుగా
మార్చి
త్రైమాసికం
జీడీపీ
విడుదల
కావటం
ఒక
కారణంగా
ఉంది.
ఈ
కాలంలో
జీడీపీ
వృద్ధి
5.1
శాతంగా
నమోదైంది.
ఇది
మార్కెట్లలో
జోష్
నింపగా..
దేశంలో
వర్షపాతం
సాధారణంగా
ఉంటుందని
భారత
వాతావరణ
శాఖ
వెల్లడించటం
కూడా
మార్కెట్లను
లాభాల
వైపు
నడిపించింది.
అలాగే
దేశీయ
బ్యాంకింగ్
రంగం
మెరుగైన
పనితీరు,
అమెరికా
డెట్
సీలింగ్
లిమిట్స్,
పెట్టుబడిదారులు
ఎనిమిది
కోర్,
ఫిస్కల్
డెఫిసిట్,
GST
నంబర్లు,
నెలవారీ
ఆటో,
PMI
సేవలు,
వచ్చే
వారంలో
తయారీ
డేటా
కోసం
ఎదురుచూస్తున్నారు.
మార్కెట్లు
ముగిసే
సమయంలో
ఎన్ఎస్ఈలోని
రిలయన్స్,
సన్
ఫార్మా,
హిందాల్కొ,
హిందుస్థాన్
యూనీలివర్,
హెచ్సీఎల్
టెక్,
దివీస్
ల్యాబ్స్,
విప్రో,
యూపీఎల్,
టెక్
మహీంద్రా,
టాటా
స్టీల్,
ఎస్బీఐ
లైఫ్,
టాటా
కన్జూమర్,
మారుతీ,
అల్ట్రాటెక్
సిమెంట్స్,
టైటాన్,
టీసీఎస్,
ఐసీఐసీఐ
బ్యాంక్,
ఐషర్
మోటార్స్,
ఇన్ఫోసిస్,
హెచ్డీఎఫ్సీ
లైఫ్
కంపెనీల
షేర్లు
టాప్
గెయినర్లుగా
తమ
ప్రయాణాన్ని
ముగించాయి.
ఇదే
క్రమంలో
సూచీలోని
ఓఎన్జీసీ,
గ్రాసిమ్,
బజాజ్
ఆటో,
భారతీ
ఎయిర్
టెల్,
పవర్
గ్రిడ్,
ఎన్టీపీసీ,
మహీంద్రా
అండ్
మహీంద్రా
కంపెనీల
షేర్లు
మాత్రమే
నష్టాల్లో
కొనసాగుతున్నాయి.
దాదాపుగా
అన్ని
రంగాలు
గ్రీన్
కలర్లో
ప్రయాణాన్ని
ముగించాయి.
English summary
markets closed in bumper profits as nifty sensex gained by 1 percent
markets closed in bumper profits as nifty sensex gained by 1 percent
Story first published: Friday, May 26, 2023, 16:30 [IST]