PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Paytm: శుభవార్త చెప్పిన పేటీఎం.. తొలిసారిగా లాభాల్లోకి..! ఇన్వెస్టర్ల పండగ..

[ad_1]

 కంపెనీ లాభాలు..

కంపెనీ లాభాలు..

కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులకు పెద్ద ఊతం వచ్చింది. దీనికి ముందు కేంద్ర ప్రభుత్వం డీమానిటైజేషన్ చేయటం కూడా ఫిన్ టెక్ కంపెనీలకు కొత్త అవకాశాలకు ద్వారం తెరిచింది. ఈ క్రమంలో తొలిసారిగా డిసెంబర్ త్రైమాసికానికి చేసిన EBITDA లాభదాయకతను నమోదు చేసింది. కంపెనీ ఊహించిన దానికంటే మూడు త్రైమాసికాల ముందే లాభాల్లోకి రావటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇన్వెస్టర్లు హ్యాపీ..

ఇన్వెస్టర్లు హ్యాపీ..

మార్కెట్లోని అందరికీ తెలుసు పేటీఎం షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఎంత క్షీణించింది అన్నది. దీనికి ప్రధాన కారణం కంపెనీ నష్టాలు. ఇబ్బడిముబ్బడిగా నష్టాలు పెరగటంతో ఇన్వెస్టర్లు ఆశ కోల్పోయారు. దీంతో కళ్లముందే వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆశల మేడలు కుప్పకూలాయి. దీంతో ఆయన ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకు తన కృషిని పెంచారు. ప్రస్తుతం పేటీఎం కంపెనీ ఒక్కో షేరు రూ.529.90 వద్ద ఎన్ఎస్ఈలో శుక్రవారం ట్రేడింగ్ ముగించాయి. అయితే తాజా ఫలితాలు ఇన్వెస్టర్లలో జోష్ నింపి షేర్ ధర పెరగటానికి కారణం కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫలితాలు ఇలా..

ESOP ఖర్చులకు ముందు రూ.31 కోట్ల EBITDAని పేటీఎం నివేదించింది. దీనికి తోడు ఏడాది ప్రాతిపదికన ఆదాయంలో 42 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ.2,062 కోట్లుగా నమోదు చేసింది. వ్యాపారంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ.. వ్యాపార భాగస్వాముల ద్వారా వినియోగదారులు పెంచుకుంది. దీనికి తోడు కంపెనీ తన సబ్‌స్క్రిప్షన్ సేవలను పెంచడం ద్వారా ఈ మైలురాయిని అందుకుంది.

లోన్స్ వ్యాపారం..

కంపెనీ ద్వారా పంపిణీ చేయబడిన రుణాల సంఖ్య 137 శాతం పెరిగి 10.5 మిలియన్లకు చేరుకున్నాయి. ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ఒక్కో పరికరానికి నెలకు రూ.100 కంటే ఎక్కువ సంపాదిస్తుంది. Paytm ఏకీకృత నికర నష్టం గతేడాది రూ.779 కోట్ల నుంచి రూ.392 కోట్లకు తగ్గింది. కంపెనీ వ్యాపార మార్జిన్ సైతం భారీగా మెరుగుపడింది.

 ముందుగా లక్ష్యానికి..

ముందుగా లక్ష్యానికి..

కంపెనీ సెప్టెంబర్ 2023 త్రైమాసిక లక్ష్యానికి ముందే EBITDA స్థాయిలో లాభదాయకతను సాధించింది. Paytm యొక్క తదుపరి ఫోకస్ ఉచిత నగదు ప్రవాహ ఉత్పత్తిపై దృష్టి సారిస్తుందని వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా కంపెనీ ప్రస్తుతం క్యాష్ బర్న్ తగ్గించుకొనేందుకు వీలుగా చర్యలు చేపడుతోంది. 10 ఏళ్ల కాలంలో ఈ మైలురాయిని అందుకోవటంపై విజయ్ శేఖర్ శర్మ టీమ్ మెుత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏమీ లేని స్థాయి నుంచి కంపెనీని ఇక్కడి వరకు తీసుకురావటంతో ఏందరి కృషి ఉందని అన్నారు.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *