News
oi-Mamidi Ayyappa
Paytm
News:
దేశంలో
డిజిటల్
చెల్లింపుల
రంగంతో
పాటే
వేగంగా
యూపీఐ
మోసాలు
కూడా
రోజూ
వెలుగులోకి
వస్తున్నాయి.
సాంకేతికతను
ఈజీ
మనీ
కోసం
కొందరు
తప్పుగా
వినియోగించుకోవటాన్ని
అరికట్టాలని
కంపెనీలు
నూతన
సాంకేతికతలను
తీసుకొస్తున్నాయి.
అలాగే
వినియోగదారులకు
సమర్థవంతమైన
కస్టమర్
కేర్
సేవలను
అందించాలని
చూస్తున్నాయి.
ఈ
క్రమంలో
తాము
పేటీఎం
ప్లాట్ఫారమ్లో
నూతన
జనరేటివ్
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్(AI)
టెక్నాలజీని
ఉపయోగించేందుకు
సిద్ధంగా
ఉన్నామని
సీఈవో
విజయ్
శేఖర్
శర్మ
తెలిపారు.
ఈ
ప్లాట్ఫారమ్
గత
సంవత్సరంలో
అభివృద్ధి
చేయబడిందని..
ఇది
మోసాలను
గుర్తించటం,
కస్టమర్
కేర్,
కస్టమర్
ఆన్బోర్డింగ్
వంటి
విభాగాల్లో
వినియోగించనున్నట్లు
తెలిపారు.
ఈ
సాంకేతికత
మానవులు
చేసే
చాలా
పనులను
భర్తీ
చేయగలదని
తెలిపారు.

జనరేటివ్
ఏఐ
టెక్నాలజీని
తీసుకురావటం
ద్వారా
సేవలు
మరింత
సమర్థవంతంగా
మారటమే
కాక..
వ్యాపారాన్ని
కొత్త
స్థాయి
పరిష్కారాలకు
స్కేల్
చేయడంలో
సహాయపడతాయని
శర్మ
వెల్లడించారు.
ఇది
ఆటోమెటిక్గా
లేదా
వినియోగదారు
ఇచ్చిన
ప్రాంప్ట్
ఆధారంగా
కొత్త
కంటెంట్,
కోడ్
లేదా
సింథటిక్
డేటాను
ఉత్పత్తి
చేస్తుందని
వెల్లడించారు.
పైగా
ఇది
ఖరీదుతో
కూడుకున్నదని
తెలిపారు.
గత
కొన్ని
త్రైమాసికాలుగా
పేటీఎం
సంస్థ
వేగవంతమైన
ఆదాయల
వృద్ధితో
నష్టాలను
తగ్గించుకుంటోంది.
ఇటీవల
విడుదలైన
నాలుగో
త్రైమాసిక
గణాంకాల
ప్రకారం
పేటీఎం
ఆదాయం
52
శాతం
పెరిగి
రూ.2,335
కోట్లకు
చేరుకోగా..
నష్టాలు
భారీగా
తగ్గి
రూ.168
కోట్లకు
పరిమితమయ్యాయి.
ఇది
మార్కెట్లో
కంపెనీ
పెరుగుతున్న
వాటా,
సామర్థ్యాలను
ప్రతిబింబిస్తుందని
మార్కెట్
వర్గాలు
అభిప్రాయపడుతున్నాయి.
English summary
Paytm CEO Vijay Shekhar Sharma says they soon using AI to detect frauds and improve customer care
Paytm CEO Vijay Shekhar Sharma says they soon using AI to detect frauds and improve customer care
Story first published: Sunday, May 7, 2023, 11:31 [IST]