[ad_1]
News
lekhaka-Bhusarapu Pavani
Sahara:
సహారా
కో-ఆపరేటివ్
సొసైటీ
వ్యవహారం
దేశవ్యాప్తంగా
ఎంతో
దుమారం
సృష్టించింది.
అయితే
అప్పుడు
డబ్బు
పెట్టి
నష్టపోయిన
ప్రజలకు
మోదీ
ప్రభుత్వం
శుభవార్త
చెప్పింది.
దీనిద్వారా
బాధితులకు
కొంతమేర
ఊరట
కలగనుంది.
మార్చి
29న
సుప్రీంకోర్టు
ఈ
కేసులో
కీలక
తీర్పు
ఇవ్వగా..
సెబీ
ఆదేశాల
అమలుకు
కేంద్ర
ప్రభుత్వం
శ్రీకారం
చుట్టింది.
సహారా
బాధితులకు
నష్టపోయిన
అమౌంట్
రీఫండ్
చేసేందుకు
‘సెంట్రల్
రిజిస్ట్రార్
ఆఫ్
కోఆపరేటివ్
సొసైటీస్
(CRCS)-సహారా
రీఫండ్
పోర్టల్’ను
కేంద్ర
హోం
మంత్రి
అమిత్
షా
ప్రారంభించారు.
ఇందులో
నమోదు
చేసుకున్న
45
రోజులలోపు
నగదు
వాపసు
క్లెయిమ్
డబ్బు
సెటిల్
చేయనున్నారు.
10
వేల
వరకు
డిపాజిట్
చేసిన
కోటి
మంది
పెట్టుబడిదారులకు
మొదటగా
చెల్లింపులు
చేయనున్నట్లు
మంత్రి
తెలిపారు.
ఇందుకోసం
5
వేల
కోట్లు
వెచ్చించనున్నట్లు
వెల్లడించారు.
మార్చి
22,
2022
లోపు
సహారా
క్రెడిట్
కోఆపరేటివ్
సొసైటీ
లిమిటెడ్,
సహారాయన్
యూనివర్సల్
మల్టీపర్పస్
సొసైటీ
లిమిటెడ్,
హమారా
ఇండియా
క్రెడిట్
కోఆపరేటివ్
సొసైటీ
లిమిటెడ్
లలో
ఇన్వెస్ట్
చేసిన
డిపాజిటర్లే
ఇందుకు
అర్హులు.
ఈ
వెబ్
సైట్
https://mocrefund.crcs.gov.in/లో
నమోదు
కావడానికి
మెంబర్షిప్
నంబర్,
డిపాజిట్
అకౌంట్
నంబర్,
ఆధార్
లింక్
చేసిన
మొబైల్
నంబర్,
డిపాజిట్
సర్టిఫికెట్,
పాన్
కార్డు
అవసరం.
క్లెయిమ్
సమర్పించిన
30
రోజులలోపు
సహారా
సొసైటీ
ధృవీకరించి,
ప్రాసెస్
చేస్తుంది.
నిధుల
లభ్యత,
ధృవీకరణ
ఆధారంగా
45
రోజులలోపు
డిపాజిటర్ల
బ్యాంక్
ఖాతాలకు
రీఫండ్
క్రెడిట్
చేయబడుతుంది.
English summary
Centre started portal to get sahara loss amount refund
Centre started portal to get sahara loss amount refund
Story first published: Wednesday, July 19, 2023, 7:32 [IST]
[ad_2]
Source link