[ad_1]
News
oi-Chekkilla Srinivas
భారత్ లోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 1.6 శాతం పెరిగింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈ స్టాక్ పెరిగింది. బలమైన కొనుగోళ్లతో రూ.616.70 వద్ద ముగిసింది. తొలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. ఏ దేశీయ రుణదాత చేసిన అతిపెద్ద సింగిల్-ఇన్ఫ్రా బాండ్ విక్రయం ఇదే. డబ్బును మౌలిక సదుపాయాలు, సరసమైన గృహాల విభాగానికి నిధుల కోసం దీర్ఘకాలిక వనరులను మెరుగుపరచడానికి వినియోగిస్తామని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎస్స్బీఐ బలమైన మద్దతు జోన్ రూ. 597 – రూ. 609 అని జిసిఎల్ సెక్యూరిటీస్ సిఇఒ రవి సింఘాల్ అన్నారు. SBI ప్రైస్ ను రూ.640 అంచనా వేసింది. ద్రవ్యోల్బణం స్థాయిలు, వడ్డీ రేట్లు స్వల్పంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ బ్యాంకులు బాగా పని చేస్తాయని ప్రాఫిషియంట్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు & డైరెక్టర్ మనోజ్ దాల్మియా తెలిపారు. “ఈ స్టాక్ ప్రస్తుత స్థాయిలలో కొంత ప్రాఫిట్ బుకింగ్ను ఎదుర్కొంటుంది, అయితే దీర్ఘకాలిక అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నందున పెట్టుబడిదారులు రూ. 574 వద్ద జమ చేసుకోవచ్చు” అని ఆయన చెప్పారు.
ఎల్కెపి సెక్యూరిటీస్లోని సీనియర్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనలిస్ట్ కునాల్ షా ఎస్బీఐ టార్గెట్ ప్రైస్ ను రూ. 700 గా అంచనా వేశారు. ” స్టాక్ అప్ట్రెండ్లో ట్రేడవుతోంది. మొమెంటం ఇండికేటర్ RSI 60 స్థాయి కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. ఇది స్టాక్ బలాన్ని నిర్ధారిస్తుంది. ఈ PSU బ్యాంక్ ర్యాలీకి అవకాశం ఉంది ” అని చెప్పారు.
Note: ఈ వార్త కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్
English summary
SBI’s share price increased significantly on Monday
India’s largest public sector bank State Bank of India rose 1.6 percent. The stock rallied after Monday afternoon. It closed at Rs.616.70 with strong buying.
Story first published: Monday, December 5, 2022, 15:58 [IST]
[ad_2]
Source link
Leave a Reply