News
oi-Mamidi Ayyappa
Paytm
News:
పేమెంట్స్
ఫిన్టెక్
పేటీఎంకి
మంచి
రోజులు
వస్తున్నట్లు
కనిపిస్తోంది.
తాజాగా
కంపెనీ
విడుదల
చేసిన
నాలుగో
త్రైమాసిక
ఫలితాలు
చాలా
ఆశాజనకంగా
ఉన్నాయి.
వీటిని
చూసిన
ఇన్వెస్టర్లలో
నమ్మకం
పెరుగుతోంది.
నాలుగో
త్రైమాసికంలో
పేటీఎం
రెవెన్యూ
51
శాతం
పెరిగి
రూ.2,334
కోట్లుగా
నమోదైంది.
2023
ఆర్థిక
సంవత్సరంలో
మెుత్తంగా
ఆదాయం
61
శాతం
మేర
పెరిగి
రూ.7,990
కోట్లుగా
నమోదైంది.
ఇదే
క్రమంలో
క్యూ-4లో
నష్టాలు
భారీగా
తగ్గి
రూ.168
కోట్లకు
పరిమితమైంది.
గత
ఏడాది
ఇదే
సమయంలో
కంపెనీ
నష్టాలు
రూ.761
కోట్లుగా
నిలిచాయి.

పేటీఎం
నష్టాలు
క్యూ-3లో
రూ.392
కోట్లుగా
ఉన్నాయి.
స్థూల
మర్చండైజ్
విలువ
(GMV),
అధిక
మర్చంట్
సబ్స్క్రిప్షన్
రాబడులు,
కంపెనీ
ప్లాట్ఫారమ్
ద్వారా
పంపిణీ
చేయబడిన
రుణాల
పెరుగుదల
కారణంగా
నాలుగో
త్రైమాసికంలో
ఆదాయ
వృద్ధికి
దారితీసిందని
కంపెనీ
వెల్లడించింది.
మార్చి
త్రైమాసికంలో
స్థూల
మర్చండైజ్
విలువ
40
శాతం
పెరిగి
రూ.3.62
లక్షల
కోట్లకు
చేరుకుంది.
అలాగే
స్టాక్
ఆప్షన్
ప్లాన్
ఖర్చులను
సైతం
కంపెనీ
భారీగా
తగ్గించుకుంది.
పేమెంట్స్
అండ్
ఫైనాన్సియల్
సర్వీసెస్
పనితీరు
మెరుగుపడటం
కంపెనీ
ఆదాయాలను
పెరగటంలో
తోడ్పడింది.
అలాగే
కంపెనీ
నికర
చెల్లింపుల
మార్జిన్
సైతం
మంచి
పెరుగుదలను
నమోదు
చేసింది.
సౌండ్బాక్స్,
POS
మెషీన్ల
వంటి
చెల్లింపు
పరికరాల
సబ్స్క్రిప్షన్
సేవలు
కూడా
బలమైన
వృద్ధిని
సాధించాయి.
మార్చి
2023
నాటికి
68
లక్షల
మంది
వ్యాపారులు
Paytm
సబ్స్క్రిప్షన్లను
చెల్లించారు.
భారీ
అంచనాలు,
వాల్యూయేషన్లతో
మార్కెట్లోకి
వచ్చిన
స్టార్టప్
పేటీఎం
ఐపీవో
ఇన్వెస్టర్లను
అప్పట్లో
భారీగా
నిరాశకు
గురిచేసింది.
అయితే
ఆర్థిక
వ్యవస్థ
వేగంగా
డిజిటల్
చెల్లింపుల
వైపు
మళ్లటంతో
కంపెనీ
క్రమంగా
నష్టాలను
తగ్గించుకుంటూ
ముందుకు
సాగుతుంది.
రానున్న
కొన్ని
త్రైమాసికాల్లో
కంపెనీ
లాభాల
బాట
పట్టే
అవకాశం
ఉందని
మార్కెట్
వర్గాలు,
ఇన్వెస్టర్లు
నమ్ముతున్నారు.
ప్రస్తుతం
పేటీఎం
కంపెనీ
షేర్
ధర
శుక్రవారం
మార్కెట్
ముగిసే
సమయానికి
3
శాతానికి
పైగా
లాభపడి
రూ.691.40
వద్ద
ఉంది.
English summary
Payments fintech Paytm loses narrowed in Q4 amid best performance, Investors happy
Payments fintech Paytm loses narrowed in Q4 amid best performance, Investors happy..
Story first published: Saturday, May 6, 2023, 13:04 [IST]