PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

చాప కింద నీటిలా విస్తరిస్తున్న స్కోడా – భారీగా పెరుగుతున్న అమ్మకాలు!


Skoda Auto in India: గత సంవత్సరం భారత మార్కెట్లో స్కోడా ఆటోకు చాలా కలిసి వచ్చింది. 2022లో స్కోడా ఆటో భారతదేశంలో 125 శాతం అభివృద్ధి సాధించింది. మొత్తం 53,721 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా దేశంలో తమ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. అంటే ఈ ఏడాది భారత్‌లో మరిన్ని కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. స్కోడా ఆటో భారతదేశాన్ని ప్రధాన ఎగుమతి కేంద్రంగా మార్చాలనుకుంటోంది.

‘వచ్చే సంవత్సరం నుంచి వియత్నాంలో వాహనాలు అసెంబుల్ చేయడానికి వాహన కిట్‌ను ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.’ అని స్కోడా ఆటో ఇండియా పేర్కొంది. స్కోడా ఆటో ఇండియా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సబ్ బ్రాండ్. ఫోక్స్‌వ్యాగన్ దేశంలోని ఆడి, పోర్షే, లంబోర్ఘిని వంటి కంపెనీల నుంచి కార్లను విక్రయిస్తుంది. గతేడాది కూడా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ అమ్మకాలు పెరిగాయి. కంపెనీ గతేడాది మొత్తం వార్షిక వాహనాల విక్రయాలు 1,01,270 యూనిట్లతో 85.48 శాతం వృద్ధిని నమోదు చేసింది.

స్కోడా ఆటో ఇండియా కంపెనీ డైరెక్టర్ పీటర్ సాల్క్ మాట్లాడుతూ, “స్కోడా ఆటోకు భారతదేశం చాలా ముఖ్యమైన మార్కెట్‌లలో ఒకటి. ఇప్పుడు భారతదేశం త్వరలో కంపెనీకి ఎగుమతి కేంద్రంగా మారబోతోంది. వచ్చే ఏడాది నుంచి భారతదేశం నుండి వియత్నాంకు వాహనాల కోసం అసెంబుల్ కిట్‌లను ఎగుమతి చేయడం కూడా ప్రారంభిస్తున్నాం.” అన్నారు. ముఖ్యంగా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఇప్పటికే భారతదేశం నుంచి మెక్సికో, మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్‌లకు ఎగుమతి చేస్తోంది.

భారతదేశంలో స్కోడా
ప్రస్తుతం, స్కోడా ఆటో భారతదేశంలో స్కోడా కుషాక్, స్లావియా, ఆక్టావియా, కొడియాక్ వంటి కార్లను విక్రయిస్తోంది. చిన్న ఎస్‌యూవీని, ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. స్కోడా కుషాక్… హ్యుందాయ్ క్రెటాతో పోటీపడుతుంది, ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉన్నాయి.

ఇతర కార్ల తయారీ కంపెనీల మాదిరిగానే స్కోడా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లు వాహన మార్కెట్ ను రూల్ చేసే అవకాశం ఉండటంతో ఆ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు.. ఎక్కువ కిలో మీటర్ల పరిధిని ఇచ్చేలా తమ తదుపరి కార్ల మీద పరీక్షలు జరుపుతోంది. ఆల్-ఎలక్ట్రిక్ స్కోడా ఆక్టావియా సెడాన్‌పై కాన్సంట్రేషన్ పెట్టిన కంపెనీ.. స్కోడా ఎన్యాక్ వంటి ఇతర మోడళ్లను మరింతగా అభివృద్ధి చేస్తోంది. మరోవైపు Ocativa మిడ్-లైఫ్ 2024లో లాంచింగ్ కు రెడీ అవుతోంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ సెడాన్  ఏ తేదీన లాంచ్ అవుతుందో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

2030 నాటికి  స్కోడా నుంచి 70%  వరకు ఎలక్ట్రిక్  వాహనాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ ఆక్టావియా SUV (ఇటీవల ఆవిష్కరించిన విజన్ 7S కాన్సెప్ట్ ద్వారా ప్రివ్యూ చేశారు), సిటీ EV, క్రాస్‌ఓవర్ 2026లో మార్కెట్లోకి వచ్చే సమయానికి  ప్రస్తుత తరం స్కోడా ఫాబియా స్థానంలో ఒక మినీ-SUVవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *