PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

సెన్సెక్స్‌కు రిలయన్స్‌ బూస్ట్‌! 62,000 పైన ట్రేడింగ్‌!

[ad_1]

Stock Market Opening 26 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌ నోట్‌లో మొదలయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలకు రిలయన్స్‌, పీఎస్‌యూ బ్యాంకులు బూస్ట్‌ ఇచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 70 పాయింట్లు పెరిగి 18,391 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 236 పాయింట్లు ఎగిసి 62,108 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,872 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,985 వద్ద మొదలైంది. 61,911 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,141 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 236 పాయింట్ల లాభంతో 62,108 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 18,321 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,368 వద్ద ఓపెనైంది. 18,333 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,400 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 70 పాయింట్లు పెరిగి 18,391 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 43,765 వద్ద మొదలైంది. 43,588 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,765 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 16 పాయింట్లు తగ్గి 43,664 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, రిలయన్స్‌, యూపీఎల్‌, దివిస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ప్రైవేటు బ్యాంకు సూచీలు కొద్దిగా ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.60,710గా ఉంది. కిలో వెండి రూ.150 తగ్గి రూ.72,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.27,280 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *