PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

క్రమంగా పెరుగుతున్న ఫారిన్‌ పెట్టుబడులు, ఈ నెలలో రూ. 8643 కోట్ల కొనుగోళ్లు

[ad_1]

<p><strong>FPIs:</strong> విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్&zwnj;పీఐలు) ఇండియన్&zwnj; ఈక్విటీల మీద ఇప్పుడు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ప్రారంభించిన విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,643 కోట్ల విలువైన ఇండియన్&zwnj; షేర్లను కొన్నారు. వాల్యుయేషన్లు ఆకర్షణీయ స్థాయిలో ఉండటం వల్ల భారత మార్కెట్&zwnj;లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు డేటాను బట్టి అర్ధం అవుతోంది.&nbsp;</p>
<p>విదేశీ పెట్టుబడులు వచ్చిన వివిధ రంగాల గురించి చూస్తే… ఏప్రిల్ 15తో ముగిసిన పక్షం రోజుల్లో FPIలు ఫైనాన్షియల్ స్టాక్స్&zwnj; మీద ఎక్కువ ప్రేమ చూపించారు, ఆ విభాగంలో రూ. 4,410 కోట్లు కురిపించారు. ఆ తర్వాత వాహన, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లలోనూ మంచి కొనుగోళ్లు చేసారు.</p>
<p>ఏప్రిల్&zwnj; నెలలో ఈక్విటీలతో పాటు, డెట్ లేదా బాండ్ మార్కెట్&zwnj;లోకి కూడా రూ. 778 కోట్లను ఓవర్సీస్&zwnj; ఫండ్&zwnj; కంపెనీలు జమ చేశాయి.</p>
<p><span style="color: #e67e23;"><strong>మార్కెట్ నిపుణుల మాట ఇది</strong></span><br />"ఎఫ్&zwnj;పిఐ ఇన్&zwnj;ఫ్లోస్&zwnj; పరంగా భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలలో ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉంది. ప్రస్తుతం భారతీయ షేర్ల విలువలు సహేతుకమైన స్థాయికి వచ్చాయి. ఈ కారణంగానే విదేశీ మదుపర్లు ఆకర్షితులవుతున్నారు" – మార్నింగ్&zwnj;స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ</p>
<p>అంతకుముందు నెల మార్చిలో కూడా ఎఫ్&zwnj;పీఐలు నెట్&zwnj; బయ్యర్స్&zwnj;గా నిలిచారు. అమ్మిన షేర్ల కంటే కొన్న షేర్ల విలువ ఎక్కువగా ఉంటే నెట్&zwnj; బయ్యర్స్&zwnj;గా పరిగణిస్తారు. ఆ నెలలో నికరంగా రూ. 7,936 కోట్లను షేర్లలో ఎఫ్&zwnj;పీఐ ఇన్వెస్ట్ చేశారు. ఈ పెట్టుబడిలో ఎక్కువ భాగం అమెరికాకు చెందిన GQG పార్టనర్స్ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి వచ్చింది.</p>
<p>మార్చి నెలలో FIIల కొనుగోళ్ల జాబితాలో… సర్వీసెస్&zwnj; (రూ. 7,246 కోట్లు), పవర్&zwnj; (రూ. 3,214 కోట్లు), మెటల్స్ &amp; మైనింగ్ (రూ. 2,938 కోట్లు), ఆటో (రూ. 2,695 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (రూ. 2,507 కోట్లు), కన్&zwnj;స్ట్రక్షన్&zwnj; (రూ. 2,224 కోట్లు), FMCG (రూ. 1,765 కోట్లు), కన్&zwnj;స్ట్రక్షన్&zwnj; మెటీరియల్స్&zwnj; (రూ. 1,423 కోట్లు), కెమికల్స్&zwnj; (రూ. 280 కోట్లు), కన్జ్యూమర్&zwnj; డ్యూరబుల్స్&zwnj; (రూ. 261 కోట్లు), రియాల్టీ (రూ. 104 కోట్లు) ఉన్నాయి.</p>
<p>గత నెలలో రూ. 6,910 విలువైన ఐటీ స్టాక్స్&zwnj;ను ఓవర్సీస్&zwnj; ఇన్వెస్టర్లు విక్రయించారు. ఆయిల్&zwnj; &amp; గ్యాస్ (రూ. 6,824 కోట్లు), హెల్త్&zwnj;కేర్ (రూ. 1,587 కోట్లు) నుంచి కూడా డాలర్లు బయటకు వెళ్లిపోయాయి.</p>
<p><span style="color: #e67e23;"><strong>2022-23లో రూ. 37,631 కోట్లు ఉపసంహరణ</strong></span><br />2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 37,631 కోట్లను వెనక్కు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దూకుడుగా వడ్డీ రేట్ల పెంచడంతో FPIలు నెట్&zwnj; సెల్లర్స్&zwnj;గా నిలిచారు. అంతకుముందు, 2021-22లో, ఇండియన్&zwnj; మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో రూ. 1.4 లక్షల కోట్ల ఉపసంహరించుకున్నారు. 2020-21లో, FPIలు షేర్లలో రూ. 2.7 లక్షల కోట్లు, 2019-20లో రూ. 6,152 కోట్లు పెట్టుబడి పెట్టారు.</p>
<p><strong>Disclaimer</strong>: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్&zwnj; ఫండ్లు, స్టాక్&zwnj; మార్కెట్&zwnj;, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్&zwnj;, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్&zwnj; పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్&zwnj; ఫండ్&zwnj;, స్టాక్&zwnj;, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్&zwnj; ఫైనాన్షియల్&zwnj; అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.</p>

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *